సీఎం జగన్ పై షర్మిల ఫైర్

Date:

Share post:

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో నిర్వ‌హించిన బహిరంగ స‌భ‌లో భాగంగా సీఎం జగన్ తన సొంత చెల్లి వైఎస్ ష‌ర్మిల‌పై చేసిన విమ‌ర్శ‌లపై షర్మిల స్పందించారు.

తాను కట్టుకున్న చీర గురించి రాజకీయ వేదికపై సీఎం జగన్ సభలో మాట్లాడటం దారుణంమని వైఎస్ షర్మిల తెలిపారు. సొంతచెల్లెలు వేసుకున్న బట్టలపై సభలో మాట్లాడుతారా? ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు! ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏం ఉంది?. నా వొంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే అసలు సభ్యత ఉందని అనుకోవాలా ? అంటూ సీఎం జగన్ పై షర్మిల మండిపడ్డారు.

అంతేకాకుండా నేను పసుపు చీర కట్టుకున్నానని… చందరబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతునని సీఎం జగన్ అంటున్నారు. పసుపు కలర్ బాబు పై గారికి పేటెంట్ రైట్ ఉందా? ఇకపోతే గతంలో సాక్షి ఛానల్ కూడా పసుపు రంగులోనే ఉండేది. పసుపు మంగళకరమైన రంగు. అది టీడీపీ సొంతం కాదు అంటూ షర్మిల చెప్పుకొచ్చారు.

పులివెందుల‌లో నిర్వ‌హించిన బహిరంగ స‌భ‌లో సీఎం జ‌గ‌న్, సొంత చెల్లి వైఎస్ ష‌ర్మిల‌పై చేసిన విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. షర్మిల ప‌సుపు చీర క‌ట్టుకుని, వైఎస్ శ‌త్రువుల‌కు ఆహ్వానించారంటూ సీఎం జగన్ విమర్శించారు. అయితే ష‌ర్మిల‌ త‌న కుమారుడు వివాహ ఆహ్వానంలో భాగంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఆహ్వానించడానికి వెళ్ళినసంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలోనే షర్మిల లైట్ ఎరుపు రంగు బార్డ‌ర్ ఉన్న‌ ప‌సుపు రంగు చీర‌ను ధరించారు.

కాగా తాజాగా పులివెందుల రాజకీయ సభలో సీఎం జగన్ ఈ చీర అంశం తెరపైకి తీసుకొచ్చారు. ప‌సుపు రంగు చీర క‌ట్టుకుని, వైఎస్ శ‌త్రువుల‌కు ఆహ్వాన ప‌త్రిక‌లు అందించారంటూ ఆనాటి ఘ‌ట‌న‌ను సభలో ప్రస్తావించడం జరిగింది.

షర్మిల ఫైర్ (YS Sharmila Fires on CM Jagan):

ALSO READ: వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

Newsletter Signup

Related articles

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..!

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేయనునట్లు తెలుస్తోంది. (YS Sharmila contesting as...