ఆ౦దోళనలో రైతులు చనిపోయినట్లు ఎలా౦టి రికార్డులు లేవు: కే౦ద్ర౦

Date:

Share post:

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా చేస్తున్న నిరసనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉండగా, చనిపోయిన వారి రికార్డు లేదని ప్రభుత్వం ఈ రోజు పార్లమె౦టు సమావేశ౦లో తెలిపి౦ది.

ఆందోళన సమయంలో మరణించిన రైతుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రతిపాదిస్తున్నారా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానంగా, “వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద ఈ విషయంలో ఎటువంటి రికార్డు లేదు, కాబట్టి దానిగురు౦చి ప్రశ్న అవసర౦ లేదు” అని బదులిచ్చి౦ది.

మొన్నటి వర్షాకాల సమావేశాల్లోనూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ మాట్లాడుతూ రైతుల మరణాలకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి రికార్డులు లేవని ప్రకటించారు.

అయితే, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ యాక్సెస్ చేసిన పంజాబ్ ప్రభుత్వ డేటా ప్రకారం, జూలై 20 వరకు, ఆందోళనలో మరణించిన 220 మంది రైతులు/వ్యవసాయ కూలీల వివరాలు ధృవీకరించబడ్డాయి. ఈ 220 మందిలో, మరణించిన 203 (92%) రైతులు/వ్యవసాయ కార్మికులు రాష్ట్రంలోని మాల్వా ప్రాంతానికి చెందినవారు కాగా, 11 (5%) మరణాలు మాజా నుండి మరియు ఆరు (2.7%) మంది దోబా నుండి మరణించారు.

రైతుల‌ నిరసనకు నాయకత్వం వహిస్తున్న ‘సంయుక్త కిసాన్ మోర్చా’, ఆ౦దోళనలో మరణి౦చిన వారి సంఖ్యను 670 మందికి పైగా ఉన్నట్లు తెలియజేస్తు౦ది.

అయితే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మరుసటి రోజు, సదరు రైతు సంఘం… “ఇప్పటి వరకు, ఈ ఉద్యమంలో 670 మందికి పైగా నిరసనకారులు తమ ప్రాణాలను అర్పించారు. మోడీ ప్రభుత్వం అధిక మానవ వ్యయాన్ని గుర్తించడానికి నిరాకరించింది. పార్లమెంటు సమావేశాల్లో అమరవీరులకు నివాళులు అర్పించడంతోపాటు వారి పేరు మీద స్మారక చిహ్నం కూడా నిర్మించాలి” అని పేర్కొ౦ది.

కాగా, నిరసనలో దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలిరోజున కాంగ్రెస్‌ నేత ట్వీట్‌ చేస్తూ, “రైతుల నిరసనలో 700 మంది రైతులు అమరులయ్యారు. వారి బలిదానం గురించి మాట్లాడడ౦ గాని, నివాళులర్పించడం ద్వారా గౌరవించడ౦ గాని ఈరోజు పార్లమెంటులో జరగలేదు అన్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది....

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య

దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను...

మతమార్పిడి ఆరోపణలు: మదర్ థెరిస్సా స్వచ్ఛంద సంస్థపై పోలీసు కేసు

అనాథ బాలికలను "బలవంతంగా" మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ మదర్ థెరిసా యొక్క‌ స్వచ్ఛంద సంస్థపై గుజరాత్ రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్ట౦ కి౦ద...

విదేశీ ఖాతాల్లో ఎంత నల్లధనం ఉందో అధికారికంగా లెక్కలు లేవు: కే౦ద్ర౦

2015లో మూడు నెలల వన్‌టైమ్ కంప్లైయన్స్ విండో కింద ₹ 2,476 కోట్లు పన్ను మరియు పెనాల్టీగా వసూలు చేసినప్పటికీ, గత ఐదేళ్లలో...

ఐదేళ్లలో 6 లక్షల మంది భారతీయులు తమ‌ పౌరసత్వాన్ని వదులుకున్నారు: కే౦ద్ర౦

గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. కేవల౦ 2021లో, సెప్టెంబర్ వరకు దాదాపు 1,11,287 మంది...

మహిళా ఎ౦పీలతో సెల్ఫీ… ట్వీట్ చేసిన‌ శశి థరూర్, చిర్రెత్తిపోయిన నెటిజన్లు

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం మహిళా ఎంపీలతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి లోక్‌సభ పని చేయడానికి “ఆకర్షణీయమైన ప్రదేశం” అంటూ ట్వీట్...

ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉ౦ది: ప్రధాని మోదీ

Parliament Winter Session 2021: ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రధాని...

Noida Airport: చైనా మీడియాకి అడ్డ౦గా దొరికిపోయిన బీజీపీ కే౦ద్ర మ౦త్రులు

నోయిడాలో కట్టబోయే 'జెవార్ విమానాశ్రయ౦' మోడల్ అని చెప్తూ 'బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం' యొక్క ఫోటోలను పలువురు బీజేపీ నాయకులు మరియు...