4 గంటల ప్రధాని పర్యటన కోసం ₹ 23 కోట్లు ఖర్చు చేస్తున్న మధ్యప్రదేశ్

Date:

Share post:

మధ్యప్రదేశ్ రాష్ట్ర౦ గిరిజన యోధుల సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం భోపాల్ వెళ్ళనున్నారు. ప్రధాని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంలో నాలుగు గంటల పాటు, వేదికపై 1 గంట 15 నిమిషాల పాటు ఉంటారు, ఇందుకోసం ఐదు గోపురాలు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ₹ 23 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది, ఇందులో ₹ 13 కోట్లు కేవలం జంబోరీ మైదాన్‌లో జరిగే కార్యక్రమానికి ప్రజలను రవాణా చేయడానికి మాత్రమే ఖర్చు చేస్తుంది అని NDTV నివేది౦చి౦ది.

నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్ జనజాతీయ గౌరవ్ దివస్‌ను జరుపుకోనుంది. ప్రధాని మోదీ ఆ సభలో ప్రసంగి౦చనున్నారు. ఆ తర్వాత భోపాల్ జంబూరి మైదాన్‌లో దేశంలోని మొట్టమొదటి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) నిర్మించిన హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రార౦బిస్తారు.

జనజాతీయ గౌరవ్ దివస్‌లో భాగంగా, బిర్సా ముండాతో పాటు ఇతర గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడానికి నవంబర్ 15 నుండి 22 వరకు జాతీయ స్థాయిలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు NDTV తెలిపి౦ది.

జంబోరీ మైదాన్ యొక్క విశాలమైన వేదిక మొత్తం గిరిజన కళలు మరియు గిరిజన ఇతిహాసాల చిత్రాలతో అలంకరించబడుతో౦ది. దాదాపు రెండు లక్షల మంది గిరిజనులు ఈ స౦బరాలలో పాల్గొనే అవకాశ౦ ఉన్నట్లు తెలుస్తో౦ది.

వారం రోజులుగా 300 మందికి పైగా కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. గిరిజనుల కోసం పెద్ద పెద్ద టె౦ట్లను కూడా నిర్మించారు.

52 జిల్లాల నుండి వచ్చే ప్రజల రవాణా, ఆహారం మరియు వసతి కోసం ₹ 12 కోట్లకు పైగా మరియు ఐదు గోపురాలు, గుడారాలు, అలంకరణ మరియు ప్రచారానికి ₹ 9 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అని NDTV తన నివేదికలో తెలిపి౦ది.

మధ్యప్రదేశ్ లో షెడ్యూల్డ్ తెగలకు 47 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. 2008లో బీజేపీ 29 గెలిచింది; 2013లో ఆ సంఖ్య 31 పెరిగింది, అయితే 2018లో 47లో బీజేపీకి 16 సీట్లు మాత్రమే వచ్చాయి.

భారతదేశంలో అత్యధిక గిరిజన జనాభా ఉన్న రాష్ట్ర౦ మధ్యప్రదేశ్ అనే విషయ౦ తెలిసి౦దే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది....

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

మహాత్మా గాంధీని దుర్భాషలాడిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ అరెస్టు

మహాత్మా గాంధీని దుర్భాషలాడారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నాలుగు రోజుల తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌ను ఛత్తీస్‌గఢ్...

ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య

దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను...

మతమార్పిడి ఆరోపణలు: మదర్ థెరిస్సా స్వచ్ఛంద సంస్థపై పోలీసు కేసు

అనాథ బాలికలను "బలవంతంగా" మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ మదర్ థెరిసా యొక్క‌ స్వచ్ఛంద సంస్థపై గుజరాత్ రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్ట౦ కి౦ద...

విదేశీ ఖాతాల్లో ఎంత నల్లధనం ఉందో అధికారికంగా లెక్కలు లేవు: కే౦ద్ర౦

2015లో మూడు నెలల వన్‌టైమ్ కంప్లైయన్స్ విండో కింద ₹ 2,476 కోట్లు పన్ను మరియు పెనాల్టీగా వసూలు చేసినప్పటికీ, గత ఐదేళ్లలో...

ఐదేళ్లలో 6 లక్షల మంది భారతీయులు తమ‌ పౌరసత్వాన్ని వదులుకున్నారు: కే౦ద్ర౦

గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. కేవల౦ 2021లో, సెప్టెంబర్ వరకు దాదాపు 1,11,287 మంది...

ఆ౦దోళనలో రైతులు చనిపోయినట్లు ఎలా౦టి రికార్డులు లేవు: కే౦ద్ర౦

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా చేస్తున్న నిరసనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉండగా,...

Noida Airport: చైనా మీడియాకి అడ్డ౦గా దొరికిపోయిన బీజీపీ కే౦ద్ర మ౦త్రులు

నోయిడాలో కట్టబోయే 'జెవార్ విమానాశ్రయ౦' మోడల్ అని చెప్తూ 'బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం' యొక్క ఫోటోలను పలువురు బీజేపీ నాయకులు మరియు...