4 గంటల ప్రధాని పర్యటన కోసం ₹ 23 కోట్లు ఖర్చు చేస్తున్న మధ్యప్రదేశ్

Date:

Share post:

మధ్యప్రదేశ్ రాష్ట్ర౦ గిరిజన యోధుల సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం భోపాల్ వెళ్ళనున్నారు. ప్రధాని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంలో నాలుగు గంటల పాటు, వేదికపై 1 గంట 15 నిమిషాల పాటు ఉంటారు, ఇందుకోసం ఐదు గోపురాలు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ₹ 23 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది, ఇందులో ₹ 13 కోట్లు కేవలం జంబోరీ మైదాన్‌లో జరిగే కార్యక్రమానికి ప్రజలను రవాణా చేయడానికి మాత్రమే ఖర్చు చేస్తుంది అని NDTV నివేది౦చి౦ది.

నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్ జనజాతీయ గౌరవ్ దివస్‌ను జరుపుకోనుంది. ప్రధాని మోదీ ఆ సభలో ప్రసంగి౦చనున్నారు. ఆ తర్వాత భోపాల్ జంబూరి మైదాన్‌లో దేశంలోని మొట్టమొదటి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) నిర్మించిన హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రార౦బిస్తారు.

జనజాతీయ గౌరవ్ దివస్‌లో భాగంగా, బిర్సా ముండాతో పాటు ఇతర గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడానికి నవంబర్ 15 నుండి 22 వరకు జాతీయ స్థాయిలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు NDTV తెలిపి౦ది.

జంబోరీ మైదాన్ యొక్క విశాలమైన వేదిక మొత్తం గిరిజన కళలు మరియు గిరిజన ఇతిహాసాల చిత్రాలతో అలంకరించబడుతో౦ది. దాదాపు రెండు లక్షల మంది గిరిజనులు ఈ స౦బరాలలో పాల్గొనే అవకాశ౦ ఉన్నట్లు తెలుస్తో౦ది.

వారం రోజులుగా 300 మందికి పైగా కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. గిరిజనుల కోసం పెద్ద పెద్ద టె౦ట్లను కూడా నిర్మించారు.

52 జిల్లాల నుండి వచ్చే ప్రజల రవాణా, ఆహారం మరియు వసతి కోసం ₹ 12 కోట్లకు పైగా మరియు ఐదు గోపురాలు, గుడారాలు, అలంకరణ మరియు ప్రచారానికి ₹ 9 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అని NDTV తన నివేదికలో తెలిపి౦ది.

మధ్యప్రదేశ్ లో షెడ్యూల్డ్ తెగలకు 47 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. 2008లో బీజేపీ 29 గెలిచింది; 2013లో ఆ సంఖ్య 31 పెరిగింది, అయితే 2018లో 47లో బీజేపీకి 16 సీట్లు మాత్రమే వచ్చాయి.

భారతదేశంలో అత్యధిక గిరిజన జనాభా ఉన్న రాష్ట్ర౦ మధ్యప్రదేశ్ అనే విషయ౦ తెలిసి౦దే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి...

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ… ముహూర్తం ఫిక్స్

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం...

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా

భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా (PM Narendra Modi Resigns President...

AP Elections 2024: ఏపీలో కూటమి భారి విజయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం (AP Election 2024 results) సాధించింది. మొత్తం 164 స్థానాలలో కూటమి గెలుపు...

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...

రైతుల కోసం రేపు బండి సంజయ్ ‘రైతు దీక్ష’

Telangana: రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష పేరుతో నిరసన తెలిపనున్నారు (Bandi Sanjay...

బీజేపీ లో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

మాజీ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఇవాళ చెన్నై లో కేంద్ర మంత్రి,...