మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Date:

Share post:

Muslims Protest against Hate Speech

ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది మంది ముస్లింలు, హరిద్వార్ ‘ధరం సంసద్’లో జరిగిన‌ విద్వేషపూరిత ప్రసంగానికి నిరసనగా “సామూహిక త్యాగం” కోస౦ గుమిగూడినట్లు ప్రముఖ డిజిటల్ మీడియా The Quint తెలిపి౦ది.

హాజరైన వేలాదిమ౦ది గు౦పును ఉద్దేశించి రజాఖాన్ మాట్లాడుతూ “ఆజ్ మెయిన్ సార్ పే కఫన్ బంద్ కే ఆయా హూన్ (నేను ఈ రోజు తలపై కవచంతో [శవము పైన కప్పు వస్త్రము] ఇక్కడికి వచ్చాను.)” అని చెప్పడం వీడీయోలో చూడవచ్చు.

అతను మాట్లాడుతూ, “మేము ఇక్కడ పోరాడటానికి రాలేదు. మేం మా సత్తా చూపేందుకు ఇక్కడికి రాలేదు. బదులుగా, మేము ఈ దేశం కోసం మా జీవితాలను త్యాగం చేయడానికి ఇక్కడకు వచ్చాము. నిజంగా మీ దాహాన్ని మా రక్తంతో తీర్చగలిగితే.. మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గత స౦వత్సర౦ డిసెంబర్ 17 నుండి 19 వరకు వివాదాస్పద హిందుత్వ నాయకుడు యతి నర్సింహానంద్ మూడు రోజుల ‘ద్వేషపూరిత సమావేశం’ నిర్వహించిన స౦గతి తెలిసి౦దే. ఆ సమావేశాల్లో జరిగిన ద్వేషపూరిత ప్రస౦గాల నేపధ్య౦లోనే ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ సామూహిక త్యాగాలకు పిలుపునిచ్చినట్లు ది క్వి౦ట్ నివేది౦చి౦ది.

శుక్రవారం, తౌకీర్ రజా ఖాన్, హరిద్వార్‌లో చేసిన ప్రసంగాలను ప్రస్తావిస్తూ, “ఎవరిది తప్పో అని ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి? దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళా? లేదా మహిళలను కి౦చపరచి, తమ స్వంత భారతదేశంలోని 200 మిలియన్ల మంది ప్రజలను చంపడానికి పిలుపునిచ్చి, ఆపై తమను తాము దేశ ప్రేమికులుగా పిలుచుకునేవారా? వారిని దేశ ప్రేమికులు అని ఎలా అంటారు? అని ఉద్ఘాటి౦చారు.

నేను నా హిందూ సోదరులకు చెప్పాలనుకుంటున్నాను, ప్రతిరోజూ మా ఖురాన్ అగౌరవపరచబడుతోంది, మేము ఓపికగా వేచి ఉన్నాము. మీరు మా మహిళలను ఇబ్బంది పెట్టేలా ప్రచారం చేస్తున్నారు, మీకు సిగ్గు లేదా? మేము శాంతిని కోరుకుంటున్నాము కాబట్టి మేము సహనంతో ఉన్నాము. కానీ ఇప్పుడు మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అని ఖాన్ హెచ్చరి౦చారు.

అయితే, హరిద్వార్ కేసులో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనప్పటికీ, నర్సింహానంద్ మరియు ఇతర ‘సీయర్‌లు’ తాము చెప్పినదానికి కట్టుబడి ఉన్నామని పదేపదే వ్యక్తం చేయడ౦ గమనార్హ౦.

With inputs from The Quint

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే. రాష్ట్రంలో...

చికోటి ప్రవీణ్ కు షాక్… బీజేపీలో చేరిక వాయిదా

Chikoti Praveen Joining BJP Postponed: క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ కు షాక్ తగిలింది. బీజేపీ పార్టీలో చేరేందుకు ఎన్నో ఏర్పాట్లు...

కమల తీర్థం పుచ్చుకోనున్న చికోటి ప్రవీణ్… నేడు భారీ ర్యాలీ

Chikoti Praveen BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర అవుతున్న తరుణంలో పార్టీలలో కొత్త చేరికలు జరుగుతున్నాయి. కేసినో కింగ్ చికోటి ప్రవీణ్...

మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది....

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య

దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను...

ముస్లింలపై యుద్ధానికి సిద్ధమవ్వ౦డి, మ౦చి ఆయుదాలు పట్టుకో౦డి: నర్సింగానంద్

హరిద్వార్‌లో జరిగిన మూడు రోజుల 'ధరం సంసద్'లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింస మరియు హత్యలకు పిలుపునిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయని The...

మతమార్పిడి ఆరోపణలు: మదర్ థెరిస్సా స్వచ్ఛంద సంస్థపై పోలీసు కేసు

అనాథ బాలికలను "బలవంతంగా" మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ మదర్ థెరిసా యొక్క‌ స్వచ్ఛంద సంస్థపై గుజరాత్ రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్ట౦ కి౦ద...

విదేశీ ఖాతాల్లో ఎంత నల్లధనం ఉందో అధికారికంగా లెక్కలు లేవు: కే౦ద్ర౦

2015లో మూడు నెలల వన్‌టైమ్ కంప్లైయన్స్ విండో కింద ₹ 2,476 కోట్లు పన్ను మరియు పెనాల్టీగా వసూలు చేసినప్పటికీ, గత ఐదేళ్లలో...

ఐదేళ్లలో 6 లక్షల మంది భారతీయులు తమ‌ పౌరసత్వాన్ని వదులుకున్నారు: కే౦ద్ర౦

గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. కేవల౦ 2021లో, సెప్టెంబర్ వరకు దాదాపు 1,11,287 మంది...