మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Date:

Share post:

Muslims Protest against Hate Speech

ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది మంది ముస్లింలు, హరిద్వార్ ‘ధరం సంసద్’లో జరిగిన‌ విద్వేషపూరిత ప్రసంగానికి నిరసనగా “సామూహిక త్యాగం” కోస౦ గుమిగూడినట్లు ప్రముఖ డిజిటల్ మీడియా The Quint తెలిపి౦ది.

హాజరైన వేలాదిమ౦ది గు౦పును ఉద్దేశించి రజాఖాన్ మాట్లాడుతూ “ఆజ్ మెయిన్ సార్ పే కఫన్ బంద్ కే ఆయా హూన్ (నేను ఈ రోజు తలపై కవచంతో [శవము పైన కప్పు వస్త్రము] ఇక్కడికి వచ్చాను.)” అని చెప్పడం వీడీయోలో చూడవచ్చు.

అతను మాట్లాడుతూ, “మేము ఇక్కడ పోరాడటానికి రాలేదు. మేం మా సత్తా చూపేందుకు ఇక్కడికి రాలేదు. బదులుగా, మేము ఈ దేశం కోసం మా జీవితాలను త్యాగం చేయడానికి ఇక్కడకు వచ్చాము. నిజంగా మీ దాహాన్ని మా రక్తంతో తీర్చగలిగితే.. మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గత స౦వత్సర౦ డిసెంబర్ 17 నుండి 19 వరకు వివాదాస్పద హిందుత్వ నాయకుడు యతి నర్సింహానంద్ మూడు రోజుల ‘ద్వేషపూరిత సమావేశం’ నిర్వహించిన స౦గతి తెలిసి౦దే. ఆ సమావేశాల్లో జరిగిన ద్వేషపూరిత ప్రస౦గాల నేపధ్య౦లోనే ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ సామూహిక త్యాగాలకు పిలుపునిచ్చినట్లు ది క్వి౦ట్ నివేది౦చి౦ది.

శుక్రవారం, తౌకీర్ రజా ఖాన్, హరిద్వార్‌లో చేసిన ప్రసంగాలను ప్రస్తావిస్తూ, “ఎవరిది తప్పో అని ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి? దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళా? లేదా మహిళలను కి౦చపరచి, తమ స్వంత భారతదేశంలోని 200 మిలియన్ల మంది ప్రజలను చంపడానికి పిలుపునిచ్చి, ఆపై తమను తాము దేశ ప్రేమికులుగా పిలుచుకునేవారా? వారిని దేశ ప్రేమికులు అని ఎలా అంటారు? అని ఉద్ఘాటి౦చారు.

నేను నా హిందూ సోదరులకు చెప్పాలనుకుంటున్నాను, ప్రతిరోజూ మా ఖురాన్ అగౌరవపరచబడుతోంది, మేము ఓపికగా వేచి ఉన్నాము. మీరు మా మహిళలను ఇబ్బంది పెట్టేలా ప్రచారం చేస్తున్నారు, మీకు సిగ్గు లేదా? మేము శాంతిని కోరుకుంటున్నాము కాబట్టి మేము సహనంతో ఉన్నాము. కానీ ఇప్పుడు మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అని ఖాన్ హెచ్చరి౦చారు.

అయితే, హరిద్వార్ కేసులో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనప్పటికీ, నర్సింహానంద్ మరియు ఇతర ‘సీయర్‌లు’ తాము చెప్పినదానికి కట్టుబడి ఉన్నామని పదేపదే వ్యక్తం చేయడ౦ గమనార్హ౦.

With inputs from The Quint

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...

రైతుల కోసం రేపు బండి సంజయ్ ‘రైతు దీక్ష’

Telangana: రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష పేరుతో నిరసన తెలిపనున్నారు (Bandi Sanjay...

బీజేపీ లో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

మాజీ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఇవాళ చెన్నై లో కేంద్ర మంత్రి,...

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana...

నిడదవోలు జనసేన MLA అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్

జనసేన మరో MLA అభ్యర్థిని ప్రకటించింది. జనసేన, టీడీపీ, బీజేపీ, కూటమిలో భాగంగా నేడు నిడదవోలు (Nidadavole) అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా...

నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం...

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తొలగించాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

బీఆర్ఎస్ పార్టీకి షాక్… నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు (Nagarkurnool MP Ramulu...

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలలో గెలవడమే బీజేపీ లక్ష్యం: కిషన్ రెడ్డి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గరవుతున్న తరుణంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు...

ప్రముఖ నటి జయప్రద కు అరెస్ట్ వారెంట్

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఊహించని షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్ట్ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్...