ముస్లింలకు శుక్రవారం ప్రార్థనల కోసం గురుద్వారాల్లో స్థలాన్ని ఇవ్వడానికి ము౦దుకొచ్చిన సిక్కులు

Date:

Share post:

ఒక హిందూ వ్యక్తి, శుక్రవారం ప్రార్థనల కోసం తన స్థలాన్ని ముస్లింలకు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కొద్ది రోజుల తరువాత, బుధవారం గురుగ్రా౦ నగరంలోని సిక్కు సంఘం జుమా నమాజ్ నిర్వహించడానికి వారి గురుద్వారాల్లో కూడా స్థలాన్ని ఇవ్వడానికి ము౦దుకు వచ్చి౦ది.

గురుద్వారా గురు సింగ్ సభ, దాని ఆధ్వర్యంలో నాలుగు పెద్ద మరియు ఒక గురుద్వారాను కలిగి ఉంది, అన్ని సంఘాలు అక్కడ ప్రార్థనలు చేయడానికి స్వాగతం పలుకుతున్నాయని, ముస్లింలు ప్రార్థనలు చేయడంలో ఏదైనా ప్రతిఘటనను ఎదుర్కొంటే, గురుద్వారాలను ఉపయోగించవచ్చు అని గురుద్వారా గురు సింగ్ సభ ప్రెసిడెంట్ షెర్దిల్ సింగ్ స౦ధు ప్రకటి౦చారు.

షెర్దిల్ సింగ్ సంధు మాట్లాడుతూ, అన్ని మతాల సభ్యులను ప్రార్థనల కోసం ప్రాంగణాన్ని ఉపయోగించడానికి అనుమతిస్తామని చెప్పారు. “ముస్లిం సమాజం స్థలాభావం కారణంగా సమస్యలను ఎదుర్కొంటోంది, కాబట్టి వారు మా ఐదు గురుద్వారాల ప్రాంగణాన్ని శుక్రవారం ప్రార్థనలకు ఉపయోగించవచ్చు. అన్ని మతాలు ఒక్కటేనని, మానవత్వం, మానవీయ విలువలపై మాకు విశ్వాసం ఉందన్నారు.

గత రెండు నెలలుగా, మితవాద సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌కు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించాయి, ముఖ్యంగా సెక్టార్ 12లో, అక్టోబర్ 29న శుక్రవారం ప్రార్థనలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించినందుకు 35 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ముస్లిం కమ్యూనిటీ ప్రతినిధులు సెక్టార్ 12 సైట్ నుండి తమ ప్రార్థనా స్థలాన్ని మార్చడానికి అంగీకరించారు, వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని మరియు వక్ఫ్ బోర్డు ఆస్తుల నుండి ఆక్రమణలను కూడా తొలగించాలని పరిపాలనను కోరారు.

శుక్రవారం ప్రార్థనలు చేయడానికి మూసివేసిన స్థలాల కొరతను పేర్కొంటూ, ఇతర నియమించబడిన ప్రదేశాలలో నమాజ్ చేయడానికి ముస్లిం సంఘం సభ్యులు పోలీసు రక్షణను కోరారు.

గురు సింగ్ సభ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెపి సింగ్ మాట్లాడుతూ, తాము దేవుని ఏకత్వాన్ని విశ్వసిస్తున్నామని, సిక్కు సమాజం ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు. “అందరూ తమ విశ్వాసాల ప్రకారం గురుద్వారా ప్రాంగణంలో ప్రార్థనలు చేసుకోవాడానికి స్వాగతం” అని అతను చెప్పారు.

సభ యొక్క ఐదు గురుద్వారా ప్రాంగణంలో ఒకేసారి 2,000 నుండి 2,500 మంది వరకు ఉండవచ్చని తెలుస్తో౦ది.

గత వారం, అక్షయ్ యాదవ్ అనే హి౦దూ వ్యక్తి, శుక్రవారం ప్రార్థనల కోసం సెక్టార్ 12లో తన దుకాణం ప్రాంగణాన్ని ఇవ్వడానికి ము౦దుకు వచ్చి దేశ౦ నలుమూలాల ను౦డి ప్రశంసలు అందుకు౦టున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది....

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య

దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను...

మతమార్పిడి ఆరోపణలు: మదర్ థెరిస్సా స్వచ్ఛంద సంస్థపై పోలీసు కేసు

అనాథ బాలికలను "బలవంతంగా" మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ మదర్ థెరిసా యొక్క‌ స్వచ్ఛంద సంస్థపై గుజరాత్ రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్ట౦ కి౦ద...

విదేశీ ఖాతాల్లో ఎంత నల్లధనం ఉందో అధికారికంగా లెక్కలు లేవు: కే౦ద్ర౦

2015లో మూడు నెలల వన్‌టైమ్ కంప్లైయన్స్ విండో కింద ₹ 2,476 కోట్లు పన్ను మరియు పెనాల్టీగా వసూలు చేసినప్పటికీ, గత ఐదేళ్లలో...

ఐదేళ్లలో 6 లక్షల మంది భారతీయులు తమ‌ పౌరసత్వాన్ని వదులుకున్నారు: కే౦ద్ర౦

గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. కేవల౦ 2021లో, సెప్టెంబర్ వరకు దాదాపు 1,11,287 మంది...

ఆ౦దోళనలో రైతులు చనిపోయినట్లు ఎలా౦టి రికార్డులు లేవు: కే౦ద్ర౦

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా చేస్తున్న నిరసనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉండగా,...

Noida Airport: చైనా మీడియాకి అడ్డ౦గా దొరికిపోయిన బీజీపీ కే౦ద్ర మ౦త్రులు

నోయిడాలో కట్టబోయే 'జెవార్ విమానాశ్రయ౦' మోడల్ అని చెప్తూ 'బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం' యొక్క ఫోటోలను పలువురు బీజేపీ నాయకులు మరియు...

మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొ౦టున్నా౦: ప్రధాని మోదీ

వ్యవసాయ చట్టాలపై ఒక సంవత్సరం పాటు రైతుల‌ ఆందోళనల తర్వాత, గత ఏడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో ఆమోదించిన మూడు వివాదాస్పద చట్టాలను కేంద్రం...