హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Date:

Share post:

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనే కాకుండా సోషల్ మీడియా మొత్తం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం పై కేంద్ర ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదన్న విషయాన్ని గమనించాలి.

మోదీ సర్కారు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన చేసిన దగ్గర్నుంచి జోరుగా ఈ వదంతులు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి 2024 నాటికీ పది సంవత్సరాలు పూర్తి కాబోతోంది. ఈ విభజనలో ప్రక్రియలో భాగంగా… తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం నిర్ణయించిందని మనందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ గడువు 2024 నాటికి ముగియనున్న తరుణంలో హైదరాబాద్‌ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) గా చేయడం వల్ల బీజేపీకి ఇక్కడ బలపడే అవకాశం ఉంటుందని కొంతమంది అంటుంటే… మరికొంత మంది హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ ను బలహీన పరిచేందుకు కేంద్రం వేసిన మాస్టర్ ప్లాన్ గా కొందరు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహోరాత్రులు కష్టపడి, పోరాటాలు చేసి, నిరసనలు తెలిపి, తమ ప్రాణాలు సైతం లెక్కచేకుండా దక్కించుకున్న ఈ రాష్ట్రాన్ని యూటిగా ప్రకటిస్తే ప్రజలు ఊరుకుంటారా… లేదా మరోసారి ఏకమవుతారా? మరి ఈ పోరాటాల్లో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు ఎలా స్పందిస్తారు?

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన రాష్ట్ర సత్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కేంద్ర నిరన్యం తో ఏకీభవిస్తుందా… లేక కేంద్రానికే ఎదురు తిరుగుతుందా?

హైదరాబాద్ ను యూటి గా చేస్తే ఏమవుతుంది?

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ నగరం ప్రత్యేక పాత్ర పోషించింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ సేతం హైదరాబాద్ నుంచే వస్తుందన్న విషయం తెలిసినదే. మరిప్పుడు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే రాష్ట్రంలో కేవలం కేంద్ర విధించే పన్ను మాత్రమే ఉంటుంది. రాష్ట్ర పన్ను ఇక ఎక్కడ వర్తించదు.

దీంతో రాష్ట్ర ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడినట్లే. ఈ భారం ప్రభుత్వం అమలు చేసే పథకాలపై పడుతుంది. మరోపక్క రాష్ట్ర అభివృధికి అడ్డు పడినట్లే. ప్రస్తుతం ఉన్న అప్పులకన్నా రాష్ట్రం మర్రిని అప్పులు చేయాల్సి ఉంటుంది.

అంతేకాకుండా రాష్ట్రానికి మరో రాజధాని నగరాన్ని నిర్మించాల్సి వస్తుంది… మరీ రాజధానిని కేంద్ర నిర్మిస్తుందా లేక రాష్ట్రమే నిర్ముచుకోవాలా? రాష్ట్రంలో కొత్తగా ఐ.టి వ్యవస్థను ప్రారంభించి స్థిరపరచాలి… ఈలోగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోవచ్చు. ఉద్యోగ కల్పనకు సమయపడుతుంది దీంతో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది.

అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రకటిస్తే… ప్రజల మద్దతు బీఆర్ఎస్‌ పార్టీ వైపే ముగ్గు చూపుతారన్నది ఖాయం. అయితే రాష్ట్ర ప్రభుత్వం, వివిధ పార్టీల నేతలు మరియు ప్రజలు కేంద్ర నిర్ణయంపై ఎలా స్పందిస్తారు అన్నది మాత్రం ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది.

ALSO READ: దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

Nepal Plane Crash: నేపాల్ వినమాశ్రయంలో ప్రమాదం

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని విమానాశ్రయంలో (Tribhuvan International Airport - TIA) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సౌర్య ఎయిర్లైన్స్ కు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోని (UPSC Chairman Manoj Soni resigned) రాజీనామా చేశారు. అయితే ఆయన...

Manolo Marquez: భారత్ ఫుట్‌బాల్ కోచ్ గా మ‌నొలొ మార్కెజ్‌

భారత్ పురుషుల ఫుట్‌బాల్ కోచ్ గా స్పెయిన్ ఫుట్‌బాల్ జ‌ట్టు మేనేజ‌ర్ మ‌నొలొ మార్కెజ్‌ నియమితులు (New India Football Head Coach...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...