ఆంధ్రప్రదేశ్: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ కి రాజీనామా చేశారు (MP Raghu Ramakrishna Raju Resigns YSRCP). ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ రెడ్డి కి పంపడం జరిగింది. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని సీఎం జగన్ ను ఆయన కోరారు.
ఈ లేఖలో… గజనీలాంటి మనస్తత్వం కలిగిన మీతో కలసి తాను పని చేయలేనని. తనపై ఎంపీగా అనర్హత వేటు వేయించేందుకు మొహమ్మద్ గజినీ మాదిరి మీరు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారని… అయితే మీరు కోరుకున్న ఫలితం ఈరోజు వచ్చిందని ఈ రాజీనామా లేఖలో రఘురాజు పేర్కొన్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున నరసాపురం నుంచి పోటీ చేసి గెలిచారు రఘురామకృష్ణరాజు. అయితే ఎన్నికల్లో గెలిచిన కొద్దీ రోజులకే హైకమాండ్ తీరు నచ్చకపోవడంతో పార్టీ కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వచ్చారు.
రఘురామకృష్ణరాజు రాజీనామా (Raghu Ramakrishna Raju Resigns YSRCP):
RRR finally quit #YSRCP. #TDPJanasena first list will be coming out soon, pic.twitter.com/PrOQIGd6BR
— M9 NEWS (@M9News_) February 24, 2024
వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు pic.twitter.com/tGhEt9yONp
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2024
ALSO READ: నోటాతో కాంగ్రెస్ పోటీ- విజయసాయి రెడ్డి