జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయి: పవన్ కళ్యాణ్

Date:

Share post:

Janasena TDP Alliance: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలిసి పనిచేస్తాయి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతేకాకుండా కచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయానికి కలిసి వస్తుందని నేను నమ్ముతున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రేమండ్ ఖైదీ గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేశారు. పవన్ తో పాటు నందమూరి బాలకృష్ణ మరియు నారా లోకేష్ చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లరు.

ప్రకటనలో భాగంగా పవన్ మీడియా తో మాట్లాడుతూ, గత నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలనా కొనసాగుతోందని…ఈ అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుని రేమండ్ కి పంపించారు అని విమర్శించారు.

తాను తీసుకున్న నిర్ణయం ‘మా ఇద్దరి భవిష్యత్తుకి సంబందించినది కాదు… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబందించినది’ అని జనసేన అధినేత తెలియజేయడం జరిగింది.

అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామజిక మాధ్యమాల్లో మిశ్రమ వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్దిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.

విచారణ లేకుండా జైల్లో ఎలా?

స్కిల్ డెవలప్మెంట్ కేసు లో చంద్రబాబుని జైల్లో ఉంచడం బాధాకరమని, అసలు విచారనే లేకుండా ఎలా జైల్లో కుర్చో పెడతారు అని పవన్ ప్రశ్నించారు.

ఆరు నెలలే జగన్ :

జగన్ నీకు కేవలం ఆరు నెలలు మార్త్రమే ఉంది. ఆరు నెలలు తరువాత జగన్ మద్దత్తుదారులు ఎవరైనా సరే, మీరు యుద్ధమే కావాలనుకుంటే… మీకు యుద్ధమే ఇస్తాము అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

సొంత అమ్మని సొంత అక్కని వదిలేసినా వ్యక్తి జగన్ అని. బాబాయ్ చనిపోతే వాళ్ళని వెనకేసుకొస్తున వ్యక్తి… అధికారులని ఎలా వెనకేసుకుని వస్తాడు అనుకుంటారు అని పవన్ ప్రశ్నించారు. అంతేకాకుండా జగన్ ని నమ్ముకొని వెళ్తే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే అధికారులకి చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.

వై.స్.ఆర్.సీ.పీ పార్టీ ట్వీట్:

“ప్యాకేజ్ బంధం బయటపడింది”

నువ్వు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌కి వెళ్ళింది @JaiTDP తో పొత్తును ఖాయం చేసుకునేందుక‌ని ప్ర‌జ‌ల‌కు పూర్తిగా అర్థం అయింది @PawanKalyan. ఇన్నాళ్ళూ నీమీద న‌మ్మ‌కం పెట్టుకున్న‌ అభిమానుల‌కు, కాస్తో కూస్తో నిన్ను న‌మ్మిన వాళ్ళ‌కు ఈరోజుతో భ్ర‌మ‌లు తొల‌గించేశావు. ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం,  అని వై.స్.ఆర్.సీ.పీ ట్వీట్ చేసింది.

ALSO READ: చంద్రబాబు అరెస్ట్: హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

AP Assembly: అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల్లో గెలిచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు....

TTD EO: టీటీడీ కొత్త ఈఓ గా శ్యామలరావు నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌(ఈవో)గా ఐఏఎస్ అధికారి జే శ్యామలరావు (J Shyamala Rao appointed as New TTD...

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం (AP CM Chandrababu Naidu Oath Ceremony) చేశారు....

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి...

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

Nandamuri Balakrishna: హిందూపురంలో బాల్లయ్య హాట్ట్రిక్

ఏపీ ఎన్నికల్లో హాట్ట్రిక్ కొట్టిన బాల్లయ్య (Nandamuri Balakrishna Hat Trick victory in Hindupuram). శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ టీడీపీ...

Janasena: జనసేన 100% స్ట్రైక్ రేట్… సరికొత్త రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో (Janasena 100 percent...

చంద్రబాబు మీద జాలేస్తోంది: విజయసాయి రెడ్డి

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ట్విట్టర్ (X) వేదికగా సెటైర్లు...

టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర భద్రతను (Chandrababu Naidu Security Increased) పెంచింది....

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...