కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్

Date:

Share post:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటయినా గెలిపించి చూపించాలంటూ కేటీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు (CM Revanth Reddy Challenges KTR to win single Loksabha Seat in Telangana).

మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగసభ (Chevella Congress Party Meeting) నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తాను తాత పేరో తండ్రి పేరో చెప్పుకొని పైకి రాలేదని.. అవినీతి పరులను అలాగే దుర్మార్గులను తొక్కుకుంటూ పైకి వచ్చానంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే అదే సభలో కేటీఆర్‌ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. “దమ్ముంటే, మొగోడివైతే.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించు.. నీఅయ్యా నువ్వు వస్తావో.. నీ అయ్యా వస్తాడో రమ్మను.. మా కార్యకర్తలు చూసుకుంటారు.” అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

“ఎవరైనా ప్రభుత్వం కూలిపోతుంది అని అంటే.. వాళ్లను గ్రామాల్లో కార్యకర్తలు చెట్టుకు కట్టేసి కొడతారు. అయ్య పేరు చెప్పుకుని సీఎం కుర్చీలో కూర్చోలేదు. కార్యకర్త స్థాయి నుంచి జెండాలు మోసి పోరాటాలు చేసి, లాఠీ దెబ్బలు తిని.. అక్రమ కేసులు ఎదుర్కొని.. చంచల్ గూడా, చర్లపల్లి జైలులో మగ్గినా తలొంచకుండా నిటారుగా నిలబడి.. నిన్ను నీ అయ్యను, నీ బావను బొందపెట్టి.. ఈ కుర్చీలో కూర్చున్నాం.” అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కేటిఆర్ కు సవాల్ (CM Revanth Reddy Challenges KTR at Chevella Meeting):

ALSO READ: రోజా ఐటెం రాణి, పులుసు పాప: బండ్ల గణేష్ కౌంటర్

Newsletter Signup

Related articles

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...

బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రీహ‌రి ద్రోహం చేశారు: హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన క‌డియం శ్రీహ‌రిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హ‌రీశ్‌రావు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు...

బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ(BSP) పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌(BRS) పార్టీలో చేరారు (RS Praveen Kumar Joins BRS Party)....

మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్నె జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది (Manne Jeevan Reddy...

TS DSC 2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Telangana: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌ను (TS Mega...

బీఆర్ఎస్ పార్టీకి షాక్… నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు (Nagarkurnool MP Ramulu...

MlC Kavitha: విచారణకు రాలేను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు సోమవారం హాజరు కాలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు (MLC Kavitha letter to...

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే. శ్రీనివాస్ రెడ్డి నియామకం

TS:తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కే. శ్రీనివాస్ రెడ్డి నియమించబడ్డారు (Senior Journalist K Srinivas Reddy appointed as...

కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తా: రేవంత్ రెడ్డి

విద్యుత్‌ అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు (CM Revanth Reddy Warns Power Officers). రాష్ట్రంలో ఎక్కడైనా కారణం...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in...

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా...