ప్రతి పేద కుటుంబానికి నెలకి రూ: 5000 ఇస్తాం: ఖర్గే

Date:

Share post:

Indiramma Universal Basic Income Support Scheme: ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5000 (Rs 5000 per month to every Poor Family) చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.

తెలంగాణలో ఆరు గ్యారంటిలతో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన విషయం తెలిసినదే. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ ఏపీ లోను అమలు చేయనున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా ఇవాళ అనంతపురంలో జరిగిన న్యాయసాధన సభలో కాంగ్రెస్ పార్టీ, ఏపీలో అమలు చేసే తొలి గ్యారంటీ హామీని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తాము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ సపోర్ట్ (Indiramma Universal Basic Income Support Scheme) పథకం తీసుకొస్తామని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలాగే ఏపీ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ: 5000 చొప్పున ఇస్తాం అని ఖర్గే అన్నారు. అయితే ఇది మోదీ లాంటి గ్యారెంటీ కాదని ఎద్దేవా చేశారు.

ఈ సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర నేతలు పాల్గొనడం జరిగింది.

అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో ఫలించిన ఈ ఆరు గ్యారెంటీల మేనిఫెస్టో ఏపీ లో కూడా పని చేస్తుందా లేదా బోల్తా కొడుతుందో వేచి చూడాలి.

రూ: 5000 ఇస్తాం (Rs 5000 per Poor Family):

ALSO READ: రూ: 500 గ్యాస్ సిలిండర్… గైడ్‌లైన్స్ ఇవే

Newsletter Signup

Related articles

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....