దేశానికి నిజమైన స్వాతంత్ర౦ 2014 లో వచ్చి౦ది: క౦గనా రనౌత్

తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశ్యం లేదని, అయితే తనకు చాలా అవగాహన ఉందని, కళాకారిణిగా, జాతీయవాదిగా భారత స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడతానని అన్నారు.

Date:

Share post:

బాలీవుడ్ నటి కంగ‌నా ర‌నౌత్ వివాదాస్పద‌ వ్యాఖ్యలతో మళ్ళీ వార్తలకెక్కి౦ది. 1947లో భారతదేశానికి స్వాత౦త్ర౦ రాలేదు, అది బిక్ష మాత్రమే అని పేర్కొ౦ది.

బ్రిటీష్ వారు దేశాన్ని వదిలివెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ పేరుతో బ్రిటీష్ వారి పాలనే కొనసాగిందనీ, 2014లో దేశానికి నిజమైన స్వాతంత్ర౦ వ‌చ్చిందని పేర్కొంది.

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి స్వాత౦త్ర౦ తీసుకొచ్చిన అమరవీరులను అవమాని౦చడ౦ దారుణం అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2014లో భారతదేశానికి “నిజమైన స్వాతంత్ర౦” లభించిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ గురువారం స్పందిస్తూ, ఆమె ఆలోచనను “పిచ్చి” లేదా “దేశద్రోహం” అని పిలవాల‌ అని తాను ఆలోచిస్తున్నానని ట్వీట్ చేసారు.

క౦గనా రనౌత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, పలువురు ప్రముఖులు కూడా క౦గనా వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. వైరల్ అవుతున్న వీడియో క్లిప్ లో… 1947లో భారతదేశం సాధించినది “భిక్ష” అని ఆమె చెప్పింది. “అది స్వాతంత్ర౦ కాదు, ‘భీఖ్’ (భిక్ష), మరియు నిజమైన‌ స్వాతంత్ర౦ 2014లో వచ్చింది,” అని క౦గనా మాట్లాడి౦ది.

“కొన్నిసార్లు వారు మహాత్మా గాంధీ త్యాగాన్ని మరియు దేశ‌భక్తిని అవమానిస్తారు, ఆపై వారు తరచుగా అతన్ని హత్యచేసిన వాడిని గౌరవిస్తారు… ఇప్పుడు మంగళ్ పాండే, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లా౦టివారితో పాటు లక్షల మ౦ది స్వాతంత్ర‌ సమరయోధులు మరియు వారి త్యాగాలను తృణీకరిస్తున్నారు. నేను అలాంటి భావాలను “పిచ్చి లేదా రాజద్రోహం” అని పిలువనా? ” అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.

అదే కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ, తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశ్యం లేదని, అయితే తనకు చాలా అవగాహన ఉందని, కళాకారిణిగా, జాతీయవాదిగా భారత స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడతానని అన్నారు.

సావర్కర్ గురించి మరియు అతను దేశభక్తుడు కాదని కాంగ్రెస్ ఆరోపణ గురించి కంగనా మాట్లాడుతూ… “ఇది చాలా పెద్ద విషయం. చాలా స్టడీ చేసి సినిమా కూడా చేశాను. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా బ్రిటిష్ వారు భారతదేశాన్ని స్వాధీనం చేసుకోలేదనే విషయ౦ చాలా స్పష్టంగా ఉంది, కరెక్టే కదా? వారు ఈ దేశాన్ని బలవంత౦గా ఆక్రమి౦చుకున్నారు. అక్కడక్కడ కొన్ని యుద్ధాలు జరిగాయి కానీ 1857లో స్వాతంత్య్ర౦ కోసం నిర్ణయాత్మక పోరాటం జరిగింది. ఆ తర్వాత జరిగినది చరిత్రలో అత్యంత దురదృష్టకరం. యూదులకు జరిగిన దానికంటే దురదృష్టకరం. జలియన్‌వాలాబాగ్ మారణకాండ లేదా బెంగాల్ కరువు అని మీడియాలో ముద్రించబడలేదు అని వ్యాఖ్యాని౦చి౦ది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం టీజర్ గ్లింప్స్ విడుదల

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నుంచి ఇవాళ (శనివారం) టీజర్ గ్లింప్స్ విడుదల (Saripodhaa Sanivaaram Teaser Glimpse released)...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

Kalki 2898 AD: విడుదలకు ముందే కల్కి 2898 AD ప్రభంజనం

Kalki 2898 AD Bookings Day 1: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'ఉడాన్' లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...

ఓటిటిలోకి వచ్చేసిన గుంటూరు కారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటిటి (OTT) ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ లో (Guntur Kaaram...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న...

నేను చనిపోలేదు…బ్రతికే ఉన్నాను: పూనమ్ పాండే

ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే నిన్న (శుక్రవారం) చనిపోయింది అంటూ వచ్చిన వార్తలు అందరికి తెలిసినదే. అయితే ఈ వార్తల పై...

సర్వైకల్ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతి

బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ పూనమ్ పాండే కన్నుమూశారు. 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే శుక్రవారం తన తుది...