తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంగం పర్యటన… తేదీలు ఖరారు

Date:

Share post:

Election Commission Telangana Visit: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం బృందం అక్టోబర్​ 3వ తేదీన పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి సంబంధిత రాజకీయ పార్టీలతో అలాగే అధికారులతో చర్చినున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలియజేసారు.

మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్న ఈసి బృందం… అక్టోబర్ 3 న జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశమై, అభిప్రాయ సేకరణ చేయనుంది.అదే రోజున ఎక్సైజ్ ఆదాయపన్ను, రవాణా శాఖల అధికారులతో మరియు బ్యాంకువాళ్లతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు సమావేశం కానుంది. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు, ఇతర కానుకల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలపై భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.

రెండవ రోజున అనగా అక్టోబర్ 4 న అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీ మరియు పోలీస్ కమిషనర్లతో సమావేశం కానుంది.

చివరి రోజు అనగా అక్టోబర్ 5న ఎన్నికల ఏర్పాటుపై సమీక్షించి… ఓటర్లకు ఎన్నికల అవగాహన కార్యక్రమంపై దృష్టిసారించనున్నారు. అంతేకాకుండా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానున్నట్లు మీడియా సమాచారం.

మూడు రోజుల పర్యటన అనంతరం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకుగాను… తెలంగాణ మినహా నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇప్పటికే పర్యటించిన సంగతి తెలిసినదే.

ALSO READ: ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటున్నట్లు (Joe...

ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్ వాడాలి: వైఎస్ జగన్

ఎన్నికలపై వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ (YS Jagan Comments/ Tweet on EVM)...

రోజా జబ్బర్దస్థ్ పిలుస్తోంది రా: బండ్ల గణేష్

ఏపీలో ఎన్నికల లెక్కింపు జరుగుతున్న తరుణంలో తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు (Bandla Ganesh Comments on Roja...

టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర భద్రతను (Chandrababu Naidu Security Increased) పెంచింది....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను...

యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ ఖాయం: సీఎం యోగి

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక్ సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు (Yogi Adityanath  Comments on UP Lok...

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలలో గెలవడమే బీజేపీ లక్ష్యం: కిషన్ రెడ్డి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గరవుతున్న తరుణంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు...

గుర్తింపులేని జనసేన పార్టీకి అనుమతి ఎలా ఇచ్చారు? విజయసాయిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తున్న సంగతి తెలిసినదే. అయితే ఈ రోజు అనగా మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023

Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు...