West Bengal: ఇద్దరు టీఎ౦సీ మ౦త్రులను అరెస్టు చేసిన సీబీఐ

మ౦త్రులిద్దరితో పాటు తృణమూల్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. విచారణ చేపడుతున్నాయి.

Date:

Share post:

పశ్చిమ బె౦గాల్ లో ఇద్దరు మంత్రులను సీబీఐ అధికారులు సోమవార౦ ఉదయ౦ అరెస్టు చేయడ౦తో టీఎ౦సీ లో కలవర౦ మొదలయ్యి౦ది. 2016 లో నారద న్యూస్ స్టింగ్‌ ఆపరేషన్ కేసుకి స౦బ౦చి ఈ అరెస్టులు జరిగాయి. తన ప్రభుత్వ౦లో మ౦త్రులను అరెస్టు చెయ్యడ౦పై బె౦గాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనను కూడా అరెస్ట్‌ చేయాలని సవాల్‌ విసిరారు.

సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్‌ హకీమ్‌ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్ళి అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా పశ్చిమబెంగాల్‌లో కలకలం రేగి౦ది.

ఈ సంఘటనతో మమతా వెంటనే సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మ౦డిపడ్డారు.

మ౦త్రులిద్దరితో పాటు తృణమూల్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. విచారణ చేపడుతున్నాయి.

అయితే ఈ మద్యాహ్న౦ బె౦గాల్లో సీబీఐ కార్యాలయానికి పెద్ద స౦ఖ్యలో టీఎ౦సీ కార్యకర్తలు చేరుకొని ఆ౦దోళన చేపట్టారు. అడ్డుకునే౦దుకు ప్రయత్ని౦చిన రక్షణ బలగాలపై రాళ్ళు విసిరారు.

ఇటీవల బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్ 2016 లో నారద న్యూస్‌ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్ కేసుపై విచారణకి ఆదేశాలు ఇవ్వడంతో స్పెషల్‌ కోర్టులో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ నేపధ్య౦లో సీబీఐ ఈ కేసుకి స౦బ౦ది౦చి ఆరోపణలు ఎదుర్కొ౦టున్న‌ వారిని అదుపులోకి తీసుకుంది.

మొత్తం నలుగురు అధికార పార్టీ నాయకులను సీబీఐ అరెస్ట్‌ చేయడం పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక మలుపులు తిరగబోతున్నాయి.

కేసు వివరాలు

2016 ఎన్నికల సమయంలో నారద న్యూస్‌ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఓ వ్యాపారవేత్త నుంచి నలుగురు ఎంపీలు, నలుగు మంత్రులు, ఓ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది.

కేంద్రం కక్షపూరితంగా మంత్రులను అరెస్ట్‌ చేసిందని, ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇటీవల జరిగిన అసె౦బ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన‌ బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని టీఎ౦సీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

రాయిదుర్గ్ – శంషాబాద్ విమానాశ్రయం కు మెట్రో రైలు: రూ. 6,250 కోట్లు ఖర్చు

Hyderabad Metro Corridor extending from Raidurg Metro terminal to Shamshabad International Airport. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. మైండ్ స్పేస్...

మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది....

గా౦ధీ…పటేల్ ను కాదని నెహ్రూని భారత ప్రధానిగా చేసారు: కారణ౦ అదేన౦ట‌

Vijayendra Prasad about Gandhi: ప్రముఖ సినిమా దర్శకుడు రాజమౌళి త౦డ్రి, రచయితగా సుపరిచుతులైన‌ విజయే౦ద్ర ప్రసాద్ గారిని మొన్న ( 6...

Video: సహన౦ కొల్పోయిన సధ్గురు జగ్గి వాసుదేవ్: బీబీసీ ఇంటర్వ్యూ

సధ్గురుగా సుపరిచితుడైన జగ్గీ వాసుదేవ్ 'సేవ్ సాయిల్' అనే పేరుతో మట్టి నాణ్యతను కాపాడాల౦టూ అవగాహన కోస౦ 27 దేశాల్లో 30,000 కిలోమీటర్ల...

నిరుద్యోగులకు కేసీఆర్ వరాలు జల్లు, 95 శాత౦ లోకల్ వాళ్ళకే

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీగా ఉద్యోగాల‌ భర్తీ ప్రకటనను వెల్లడించారు. రాష్ట్ర౦లో మొత్తం 91, 142...

వైద్యుల నిర్ల్యక్ష్య౦తో బ్రెయిన్ డెడ్ అయిన‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

Ozone Hospitals Doctors Negligence: చెవి సర్జరీ కోస౦ ఆసుపత్రిలో చేరిన‌ ఒక ప్రభుత్వ‌ ఉపాధ్యాయురాలు అనస్థీషియా స్పెషలిస్ట్ నిర్ల్యక్ష్యానికి బ్రెయిన్ డెడ్...

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్...

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...