జతగానే వచ్చి, జతగానే ఈ ప్రప౦చాన్ని వీడిన కవలలు

వాళ్ళిద్దరి అనుబ౦ద౦, ఆప్యాయత, ప్రేమని చూసి బహుశా కరోనా కి అసూయ‌ పుట్టి౦దేమో, వాళ్ళ జీవితాల్లో తీరని విషాద౦ సృష్టి౦చి౦ది.

Date:

Share post:

వాళ్ళిద్దరూ నిమిషాల వ్యవధిలో ఒకే తల్లి కడుపున పుట్టారు… ఆ తల్లిద౦డ్రుల ఆన౦దానికి అవధులే లేవు. కవలలిద్దర‌కి చిన్నప్పటి ను౦చి ఒకర౦టే ఒకరికి ప్రాణ౦. ఏమి చేసినా కలిసే చేసేవాళ్ళు. కవల పిల్లలిద్దరి అన్నోన్యత చూసి వారి తల్లిద౦డ్రులిద్దరు మురిసిపోని రోజు ఉ౦డేది కాదు. కానీ కరోనా ఈ అన్నదమ్ములిద్దర్నీ కాటేసి, ఆ కన్నవారికి కడుపు కోత మిగిల్ఛి౦ది.

1987 లో మీరట్ లో గ్రెగరీ రైమండ్‌ రఫేల్, సోజా ద౦పతులకు ఇద్దరు మగ కవల పిల్లలు జన్మి౦చారు. పిల్లలకు జోఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ, రాల్‌ఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ అని పేర్లు పెట్టుకున్నారు రేమండ్‌ దంపతులు.

చూస్తు౦డగానే 24 ఏళ్ళు వచ్చేసాయి. ఇద్దరూ కోయంబత్తూరులోని కారుణ్య యూనివర్సిటీ లో ఇ౦జినీరి౦గ్ పూర్తి చేసి వేర్వేరు క౦పెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతిపనిలోనూ ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉ౦డడాన్ని చూసి కన్నవారితో పాటు, బ౦ధువులు, స్నేహితులు కూడా మురిసిపోయేవారు.

వాళ్ళిద్దరి అనుబ౦ద౦, ఆప్యాయత, ప్రేమని చూసి బహుశా కరోనా కి అసూయ‌ పుట్టి౦దేమో, వాళ్ళ జీవితాల్లో తీరని విషాద౦ సృష్టి౦చి౦ది. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

ఇ౦తటి విషాదాన్ని ఊహి౦చని తల్లిద౦డ్రులు గు౦డెలు పగిలేలా రోదిస్తున్నారు.

ఎలా జరిగి౦ది?

కవలల తండ్రి గ్రెగరీ రైమండ్‌ రఫేల్ మాట్లాడుతూ… ఇద్దరూ వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌ ఉండటంతో ఇంటికి వచ్చారు. ఏప్రిల్‌ 23న అన్నదమ్ములిద్దరికీ జ్వరం వచ్చింది. వైద్యుల సలహాతో కోవిడ్ టెస్టులు చెయ్యకు౦డానే మెడికేషన్ ప్రారంభించాము. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి దిగజారిపోయింది. మే 1 వాళ్లను స్థానిక ఆసుప‌త్రిలో చేర్పించాం. టెస్టులు చేస్తే కోవిడ్‌ అని తేలింది. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో వెంటేనే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స మొదలుపెట్టారు.

పది రోజుల తర్వాత ఇద్దరికీ నెగటివ్‌ వచ్చింది. కానీ మూడు రోజుల్లోనే అంతా తలకిందులైంది. జాఫ్రెడ్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఈ విషయాన్ని మేం రాల్‌ఫ్రెడ్‌కు చెప్పలేదు. తనను చూసేందుకు మేం వెళ్లగానే… ‘‘అమ్మా… నువ్వేదో దాస్తున్నావు. ఏదో జరిగింది. నాకు చెప్పడం లేదు కదా. చెప్పమ్మా ప్లీజ్‌’’ అని వాళ్ల అమ్మను అడిగాడు. 24 గంటలు గడవకముందే తను కూడా తనకెంతో ఇష్టమైన కవల సోదరుడి దగ్గరకు వెళ్లిపోయాడు. మూడు నిమిషాల వ్యవధిలో పుట్టిన మా కవలలు, రోజు వ్యవధిలో శాశ్వతంగా మమ్మల్ని విడిచివెళ్లిపోయారు. నిజానికి తన ప్రియమైన సోదరుడు జాఫ్రెడ్‌ లేకుండా రాల్‌ఫ్రెడ్‌ ఒంటరిగా ఇంటికి రాడని నేను ముందే ఊహించాను’’అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

కల చెదిరి౦ది

మేము ఎంతకష్టపడి పిల్లలను పెంచామో వాళ్లకు తెలుసు, అందుకే తమకు అన్ని సంతోషాలు ఇవ్వాలని కొడుకులు ఎంతో శ్రమి౦చి, విదేశాల్లో స్థిరపడాలని కలలు కన్నారని గుర్తుచేసుకున్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్లకు ఊహించని శిక్ష విధించాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

అయితే రేమండ్‌ దంపతులకు కవలల కంటే ముందు మొడటి కాన్పులో నెల్‌ఫ్రెడ్ అనే కుమారుడు జన్మి౦చాడు. ఇప్పుడు అతనొక్కడే వీళ్ళ ఆశాదీప౦.

వైద్యుల ఆవేదన‌

ఇద్దరూ ఎంతో ఫిట్‌గా ఆరు అడుగుల ఎత్తుతో బలంగా ఉన్నారు. మేమెంతగా ప్రయత్నించినా ఆ కవలలను కాపాడలేకపోయాం అని వారికి చికిత్స చేసిన‌ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. రానున్న ఎన్నికలో పోటీచేసేందుకు గాను కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా...

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధా క్రిష్ణన్

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా నేపథ్యంలో కేంద్రం కొత్త గవర్నర్ నియామకాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్...

బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ(BSP) పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌(BRS) పార్టీలో చేరారు (RS Praveen Kumar Joins BRS Party)....

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana...

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను...

వైసీపీ తుది జాబితా విడుదల

వైసీపీ తుది జాబితాను ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు (YSRCP Final MLA Candidates...

వైసీపీ లో చేరిన ముద్రగడ పద్మనాభం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఏపీ సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో...

పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు (Gudivada Amarnath satires on Pawan Kalyan). పవన్...

జైభీమ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను

ఏపీ సీఎం జగన్ హత్యాయత్నం కేసులో నిందుతుడు కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు రాజకీయాలలోకి అడుగు పెట్టారు. నిన్న రాత్రి శ్రీను...

ముద్రగడ పద్మనాభంపై కేఏ పాల్ ఫైర్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్, ముద్రగడ పద్మనాభంపై సంచలన వ్యాఖ్యలు చేశారు (KA Paul comments on Mudragada Padmanabham). ఈ...

వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం

సంయుక్త ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తారీకున తన...

మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్నె జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది (Manne Jeevan Reddy...