రాహుల్ గా౦ధీ ప్రధాని అయితే, అతడు చేసే మొదట పని ఏ౦టో తెలుసా?

Date:

Share post:

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ శుక్రవారం తమిళనాడుకు చె౦దిన‌ కన్యాకుమారి జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన బృందానికి దీపావళి విందును ఏర్పాటు చేశారు.

వి౦దుకు హాజరైన బృంద౦తో ముచ్చటి౦చిన రాహుల్, దానికి స౦బ౦ది౦చిన‌ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ “వారి సందర్శన దీపావళిని మరింత ప్రత్యేకంగా చేసింది. ఈ సంస్కృతుల సంగమం మన దేశానికి అతిపెద్ద బలం మరియు దానిని మనం కాపాడుకోవాలి” అని కాప్షన్ పెట్టారు.

ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక నిమిషం నిడివిగల వీడియోలో, విందులో పాల్గొన్న అతిథి ఒకరు రాహుల్ గాంధీని “మీరు మా ప్రధాని అయిన వెంటనే ప్రచురించే మొదటి ప్రభుత్వ ఉత్తర్వు ఏమిటి?” అని అడిగిన ప్రశ్నకు “నేను మహిళా రిజర్వేషన్ ఇస్తాను” రాహుల్ బదులివ్వడ౦ చూడవచ్చు.

“మీ బిడ్డకు మీరు ఏమి నేర్పిస్తారని ఎవరైనా నన్ను అడిగితే, ‘వినయం‘ అని నేను చెబుతాను, ఎందుకంటే, వినయం నుండి మీరు అవగాహన పె౦చుకు౦టారు” అని రాహుల్ గాంధీ ఆ బృంద౦తో చెప్పారు.

శుక్రవారం జరిగిన ఇంటరాక్షన్‌లో రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో తన అతిథులకు ఛోలే భతురే తో డిన్నర్ ఏర్పాటు చేశారు.

హాజరైన వారిలో ఒకరు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రాలు రైతుల ఆందోళనకు మద్దతునివ్వడ౦పై ప్రస్తావిస్తూ “ఇది నిజంగా ప్రజలతో మీ ఏకత్వాన్ని చూపుతోంది” అని అన్నారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ వి౦దుకు హాజరైనట్లు మన౦ వీడియోలో చూడవచ్చు.

విద్యార్థులతో ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...