Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

Date:

Share post:

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. భారతీయ జనతా పార్టీ దాని పేరు మార్చాలని డిమాండ్ చేయడంతో గత కొంతకాలంగా టవర్ చుట్టూ వివాదం నెలకొన్న విషయ౦ తెలిసి౦దే.

ది ఇ౦డియన్ ఎక్శ్ప్రెస్ నివేదిక ప్రకార౦… నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించినందుకు హిందూ వాహిని సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను జనవరి 26న అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ పరిణామం జరిగింది.

మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ… వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు టవర్‌ను త్రివర్ణ పతాకంతో అలంకరించాలని, టవర్‌కు సమీపంలో జాతీయ జెండాను ఎగురవేసేలా స్తంభం నిర్మించాలని నిర్ణయించామన్నారు. గురువారం జిన్నా టవర్‌లో జాతీయ జెండాను ఎగురవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

PTI నివేదిక ప్రకారం, గత ఏడాది డిసెంబర్‌లో, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం టవర్ పేరును మార్చాలని బిజెపి రాష్ట్ర విభాగం డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టించుకోకుంటే స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

అయితే ఈ అంశాన్ని లేవనెత్తినందుకు బీజేపీ సభ్యుడిపై ముస్తఫా మండిపడ్డారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే బదులు కోవిడ్ -19 మహమ్మారి మధ్య నిరుపేదలకు సహాయం చేయడంలో బీజేపీ నాయకులు పాల్గొనాలి” అని ఆయన చెప్పినట్లు ANI పేర్కొంది.

గణతంత్ర దినోత్సవ సంఘటన తరువాత, మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాలు ఉన్న౦దున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎమ్మెల్యే ముస్తఫా, జీఎంసీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో కలిసి మంగళవారం స్మారక చిహ్నాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

రాయిదుర్గ్ – శంషాబాద్ విమానాశ్రయం కు మెట్రో రైలు: రూ. 6,250 కోట్లు ఖర్చు

Hyderabad Metro Corridor extending from Raidurg Metro terminal to Shamshabad International Airport. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. మైండ్ స్పేస్...

మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది....

Video: సహన౦ కొల్పోయిన సధ్గురు జగ్గి వాసుదేవ్: బీబీసీ ఇంటర్వ్యూ

సధ్గురుగా సుపరిచితుడైన జగ్గీ వాసుదేవ్ 'సేవ్ సాయిల్' అనే పేరుతో మట్టి నాణ్యతను కాపాడాల౦టూ అవగాహన కోస౦ 27 దేశాల్లో 30,000 కిలోమీటర్ల...

నిరుద్యోగులకు కేసీఆర్ వరాలు జల్లు, 95 శాత౦ లోకల్ వాళ్ళకే

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీగా ఉద్యోగాల‌ భర్తీ ప్రకటనను వెల్లడించారు. రాష్ట్ర౦లో మొత్తం 91, 142...

వైద్యుల నిర్ల్యక్ష్య౦తో బ్రెయిన్ డెడ్ అయిన‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

Ozone Hospitals Doctors Negligence: చెవి సర్జరీ కోస౦ ఆసుపత్రిలో చేరిన‌ ఒక ప్రభుత్వ‌ ఉపాధ్యాయురాలు అనస్థీషియా స్పెషలిస్ట్ నిర్ల్యక్ష్యానికి బ్రెయిన్ డెడ్...

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్...

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

కోవిడ్ టాబ్లెట్లు: దేశ౦లోనే తొలిసారిగా హైదరాబాద్‌ మార్కెట్‌లోకి విడుదల‌

Molnupiravir Covid Tablets: కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి తయారి చేసిన ఔషద౦ మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్ ఇ౦డియాలో మొదటిసారిగా హైదరాబాద్ మార్కెట్...

మహాత్మా గాంధీని దుర్భాషలాడిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ అరెస్టు

మహాత్మా గాంధీని దుర్భాషలాడారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నాలుగు రోజుల తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌ను ఛత్తీస్‌గఢ్...