Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

Date:

Share post:

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. భారతీయ జనతా పార్టీ దాని పేరు మార్చాలని డిమాండ్ చేయడంతో గత కొంతకాలంగా టవర్ చుట్టూ వివాదం నెలకొన్న విషయ౦ తెలిసి౦దే.

ది ఇ౦డియన్ ఎక్శ్ప్రెస్ నివేదిక ప్రకార౦… నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించినందుకు హిందూ వాహిని సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను జనవరి 26న అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ పరిణామం జరిగింది.

మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ… వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు టవర్‌ను త్రివర్ణ పతాకంతో అలంకరించాలని, టవర్‌కు సమీపంలో జాతీయ జెండాను ఎగురవేసేలా స్తంభం నిర్మించాలని నిర్ణయించామన్నారు. గురువారం జిన్నా టవర్‌లో జాతీయ జెండాను ఎగురవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

PTI నివేదిక ప్రకారం, గత ఏడాది డిసెంబర్‌లో, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం టవర్ పేరును మార్చాలని బిజెపి రాష్ట్ర విభాగం డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టించుకోకుంటే స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

అయితే ఈ అంశాన్ని లేవనెత్తినందుకు బీజేపీ సభ్యుడిపై ముస్తఫా మండిపడ్డారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే బదులు కోవిడ్ -19 మహమ్మారి మధ్య నిరుపేదలకు సహాయం చేయడంలో బీజేపీ నాయకులు పాల్గొనాలి” అని ఆయన చెప్పినట్లు ANI పేర్కొంది.

గణతంత్ర దినోత్సవ సంఘటన తరువాత, మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాలు ఉన్న౦దున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎమ్మెల్యే ముస్తఫా, జీఎంసీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో కలిసి మంగళవారం స్మారక చిహ్నాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

Asaduddin Owaisi Comments On Chandrababu: ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, భిన్న అభిప్రాయాలు...

దాసోజు శ్రవణ్ కు షాక్ … నామినేషన్ తిరస్కానించిన గవర్నర్

Dasoju Sravan MLC Rejected: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ తమిళిసై దాసోజు శ్రావణ్...

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే

September 2023 OTT release: వినాయక చవితి హడావిడి ఈ వారంతో ముగియనుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అసలైన సినిమా పండగ...

తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే. రాష్ట్రంలో...

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు...

హైదరాబాద్ మెట్రో హాలిడే కార్డ్ : రూ.59 కే అపరిమిత ప్రయాణం

Hyderabad Metro Holiday Card: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో ప్రయాణీకులకు మెరుగైన అభూతిని అందించడం కోసం సూపర్ సేవర్...

బాలకృష్ణ విజిల్… అసెంబ్లీ హడల్ !

Balakrishna Whistle in AP Assembly: ఆంధ్రలో అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. రెండవరోజు అసెంబ్లీ సమావేశంలో తెలుగు దేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే...

దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే

Emergency Alert on Phones: దేశవ్యాప్తంగా గురువారం కొంతమంది మొబైల్ వినియోగదారులకు ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. అయితే ఈ అలర్ట్‌ మెసేజ్ చూసి...

అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య…! స్పీకర్ వార్నింగ్

Balakrishna AP Assembly: ఏపీ లో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశం జరుగుతున్న...

బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్

Byjus New CEO: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ భాద్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సీఈఓగా...

తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంగం పర్యటన… తేదీలు ఖరారు

Election Commission Telangana Visit: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం...

ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

Jio AirFiber: నెటిజన్లు ఎంతో ఆసిక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ మార్కెట్లోకి రానే వచ్చింది. దేశంలోని మొత్తం 8 మెట్రో...