హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Date:

Share post:

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనే కాకుండా సోషల్ మీడియా మొత్తం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం పై కేంద్ర ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదన్న విషయాన్ని గమనించాలి.

మోదీ సర్కారు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన చేసిన దగ్గర్నుంచి జోరుగా ఈ వదంతులు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి 2024 నాటికీ పది సంవత్సరాలు పూర్తి కాబోతోంది. ఈ విభజనలో ప్రక్రియలో భాగంగా… తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం నిర్ణయించిందని మనందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ గడువు 2024 నాటికి ముగియనున్న తరుణంలో హైదరాబాద్‌ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) గా చేయడం వల్ల బీజేపీకి ఇక్కడ బలపడే అవకాశం ఉంటుందని కొంతమంది అంటుంటే… మరికొంత మంది హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ ను బలహీన పరిచేందుకు కేంద్రం వేసిన మాస్టర్ ప్లాన్ గా కొందరు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహోరాత్రులు కష్టపడి, పోరాటాలు చేసి, నిరసనలు తెలిపి, తమ ప్రాణాలు సైతం లెక్కచేకుండా దక్కించుకున్న ఈ రాష్ట్రాన్ని యూటిగా ప్రకటిస్తే ప్రజలు ఊరుకుంటారా… లేదా మరోసారి ఏకమవుతారా? మరి ఈ పోరాటాల్లో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు ఎలా స్పందిస్తారు?

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన రాష్ట్ర సత్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కేంద్ర నిరన్యం తో ఏకీభవిస్తుందా… లేక కేంద్రానికే ఎదురు తిరుగుతుందా?

హైదరాబాద్ ను యూటి గా చేస్తే ఏమవుతుంది?

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ నగరం ప్రత్యేక పాత్ర పోషించింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ సేతం హైదరాబాద్ నుంచే వస్తుందన్న విషయం తెలిసినదే. మరిప్పుడు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే రాష్ట్రంలో కేవలం కేంద్ర విధించే పన్ను మాత్రమే ఉంటుంది. రాష్ట్ర పన్ను ఇక ఎక్కడ వర్తించదు.

దీంతో రాష్ట్ర ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడినట్లే. ఈ భారం ప్రభుత్వం అమలు చేసే పథకాలపై పడుతుంది. మరోపక్క రాష్ట్ర అభివృధికి అడ్డు పడినట్లే. ప్రస్తుతం ఉన్న అప్పులకన్నా రాష్ట్రం మర్రిని అప్పులు చేయాల్సి ఉంటుంది.

అంతేకాకుండా రాష్ట్రానికి మరో రాజధాని నగరాన్ని నిర్మించాల్సి వస్తుంది… మరీ రాజధానిని కేంద్ర నిర్మిస్తుందా లేక రాష్ట్రమే నిర్ముచుకోవాలా? రాష్ట్రంలో కొత్తగా ఐ.టి వ్యవస్థను ప్రారంభించి స్థిరపరచాలి… ఈలోగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోవచ్చు. ఉద్యోగ కల్పనకు సమయపడుతుంది దీంతో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది.

అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రకటిస్తే… ప్రజల మద్దతు బీఆర్ఎస్‌ పార్టీ వైపే ముగ్గు చూపుతారన్నది ఖాయం. అయితే రాష్ట్ర ప్రభుత్వం, వివిధ పార్టీల నేతలు మరియు ప్రజలు కేంద్ర నిర్ణయంపై ఎలా స్పందిస్తారు అన్నది మాత్రం ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది.

ALSO READ: దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు...

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...

విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad...

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

Galgotias University Robot ఓ చైనా కుక్క: AI Impact Summit 2026

ఢిల్లీలో జరుగుతున్న  India AI Impact Summit 2026 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన Galgotias University robot పేరు ఇప్పుడు దేశం...

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో హైదరాబాద్లో నిరసనలు

తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు ఒక రోజు ముందు, బిజెపి అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని...

రుతుక్రమంలో ఉన్న దళిత బాలికను తరగతి గది బయట పరీక్షలు రాయించిన స్కూల్ ప్రిన్సిపాల్

8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం వచ్చిందని చెప్పి ఆమె తరగతి గదిలోకి ప్రవేశించకుండా కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాల నిషేధించిందని ది టైమ్స్...

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...