శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో ప్రచారంలో నేపథ్యంలో కృపారాణి మర్యాదపూర్వకంగా షర్మిలను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా కిల్లి కృపారానికి వైఎస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించడం జరిగింది.
అయితే ఇటీవలే కిల్లి కృపారాణి వైసీపీ ప్రభుత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసినదే. వైసీపీలో నాకు అన్యాయం, అవమానం జరిగింది అని ఆమె పేర్కొన్నారు. అలాగే కేబినెట్ ర్యాంక్ ఇస్తామని తనని పిలిచారని.. నాకు ఎంపీ టికెట్ ఇస్తామని మోసం చేసారని… ‘పదవులు కాదు నాకు గౌరవం ముఖ్యం నాకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడే ఉంటా’ అంటూ కిల్లి కృపారాణి తన రాజీనామా లేఖలో చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ లోకి కిల్లి కృపారాణి (Killi Kriparani Joined Congress Party):
వైఎస్సార్సీపీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న BC నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి…
BC ద్రోహుల పార్టీ వైఎస్సార్సీపి 😡😡😡#TDP #YSRCP #BJP #Janasena pic.twitter.com/1pc59MSMH2— sivazee (@sivazeestudio) April 5, 2024
వైసీపీకి బై బై కిల్లి కృపారాణి:
వైసీపీకి కిల్లి కృపారాణి బైబై
కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేశారు. వైసీపీలో ప్రజాసేవకు అవకాశం లేదంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.#AndhraPradesh #YSRCP #killikruparani #resignation #NewsUpdates… pic.twitter.com/FYLZ8jBR2N
— BIG TV Breaking News (@bigtvtelugu) April 3, 2024
ALSO READ: నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం