నవంబర్ 28 ఆదివారం ఢిల్లీలోని ద్వారకలో చర్చి గా మార్చిన ఒక గోడౌన్ ధ్వంసం చేయబడింది.
“నవంబర్ 28 ఉదయం 9.30 గంటలకు మటియాలా రోడ్లోని చర్చి గా మారిన గోడౌన్ వద్ద గొడవ జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. విచారణలో, నివాసితులు మరియు స్థానిక దుర్మార్గుల బృందం ‘చర్చి’ అని వ్రాసిన బోర్డును ధ్వంసం చేసినట్లు తెలిసినట్లు సమాచార౦.
“గోడౌన్ చర్చిగా మారడంపై నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు మరియు మత మార్పిడిపై ఆందోళనలు చె౦దారు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి తెలియజేసినట్లు ‘ది క్కి౦ట్’ నివేది౦చి౦ది.
ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు విధ్వంసానికి పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు పోలీసు అధికారి ది క్వింట్కి తెలియజేశారు. DDMA మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు చర్చిలో ఉన్న వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
ఈ రె౦డు ఎఫ్ఐఆర్ లు బిందాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి.
అయితే ఈ చర్చిలో ఇదే మొదటి ఆదివార౦ ప్రార్థన అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదిక ప్రకార౦ తెలుస్తో౦ది.
ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు సమాచారం. అయితే అలాంటి గాయాలు ఏమీ లేవని పోలీసులు కొట్టిపారేశారు.
With inputs from The Quint