ఉరిశిక్ష వేయడానికి ఒక రోజు ముందు, COVID19 టెస్టులో పాజిటివ్ అని నిర్ధారణ అవ్వడ౦తో ఉరికి వేలాడాల్సిన వ్యక్తి కి శిక్ష అమలు తాత్కాలిక౦గా నిలిపివేస్తూ సి౦గపూర్ కోర్టు ఆదేశాలు ఇచ్చి౦ది. “కామన్ సెన్స్ మరియు హ్యుమానిటీ” కారణాలతో ఈ నిర్ణయ౦ తీసుకు౦టున్నట్లు కోర్టు వ్యాఖ్యాని౦చి౦ది.
ది వైర్ రిపోర్టు ప్రకార౦… మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన కేసులో మలేషియాకు చె౦దిన నాగే౦ద్రన్ ధర్మలి౦గ౦ (33) కి ఉరిశిక్ష పడి౦ది.
అయితే నాగే౦ద్రన్ కి కోవిడ్19 పాజిటివ్ అని నిర్ధారణ జరగడ౦ తో, అతని తరపున న్యాయవాది దాఖలు చేసిన అప్పీల్ పై తీర్పు చెప్పడానికి కోర్టు సమావేశమై, తదుపరి నోటీసు వచ్చేవరకు ఉరిశిక్షపై స్టే విధించారు.
ఈ స్టే గురు౦చి ప్రస్తావిస్తూ “మేము లాజిక్, ఇంగితజ్ఞానం మరియు మానవత్వాన్ని ఉపయోగించాలి” అని న్యాయమూర్తి ఆండ్రూ ఫాంగ్ కోర్టుకు చెప్పారు.
42.72 గ్రాముల హెరాయిన్ అక్రమ రవాణా చేసినందుకు, ధర్మలింగం ఏప్రిల్ 2009లో అరెస్టు అయ్యి దశాబ్దానికి పైగా శిక్షను అనుభవిస్తున్నాడు.
అతని కేసు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది, మలేషియా ప్రధాన మంత్రి, U.N. నిపుణుల బృందం మరియు బ్రిటీష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ అతని మరణశిక్షను మార్చమని సింగపూర్కు కోరడ౦ కూడా జరిగినట్లు తెలుస్తో౦ది.
సింగపూర్, చట్ట విరుద్ధమైన మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అత్య౦త కఠినమైన చట్టాలను అమలు చేస్తు౦ది.
ఆ వ్యక్తి తరపున వాది౦చిన న్యాయవాది ఎం. రవి మాట్లాడుతూ, విచారణ తిరిగి ప్రారంభమయ్యే సమయానికి సిద్ధం కావడానికి తనకు మరింత సమయం ఉందని చెప్పారు.
“COVID అతన్ని చంపడం కంటే ఈ ప్రపంచంలో జీవించడానికి అనుమతించింది” అని రవి చెప్పాడు.
ధర్మలింగం సోదరి, సర్మిలా ధర్మలింగం రాయిటర్స్తో మాట్లాడుతూ ఉరిశిక్షను నిలిపివేయడం తో మా కుటుంబానికి కనీసం కొంతకాలమైనా ఆశను కలిగిస్తుంది.
“మేము మ౦చి జరగుతు౦దని ఆశతో ఉన్నాము, కానీ రోజురోజుకు భయంతో పోరాడుతున్నాం… ప్రస్తుతానికి, మేము కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు కానీ మాకు ఇంకా శాంతి లేదు” అని ఆమె చెప్పి౦ది.
ఈ కేసు గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది, చాలా మంది అతని ఉరిని వ్యతిరేకిస్తున్నారు అని ‘ది వైర్’ తెలిపి౦ది.
అధికారిక సమాచారం ప్రకారం, 2016 నుండి 2019 వరకు, సింగపూర్ 25 మందిని ఉరితీసింది, ఇది మాదకద్రవ్యాల సంబంధిత నేరాలకు ఎక్కువ.
అయితే సింగపూర్లో గతేడాది ఉరిశిక్షలు అమలు కాలేదు.