Infosys భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తో౦ది… RSS తీవ్ర ఆరోపణలు

Date:

Share post:

ప్రభుత్వ విధానాలను విమర్శి౦చే వాళ్ళను, అసమ్మతి వాదులను “Anti National” గా ముద్ర వేసే౦దుకు ఎప్పుడూ ము౦దు౦డే RSS, ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ ని కూడా ” దేశ వ్యతిరేకుల” జాబితాలో వెసే ప్రయత్న౦ మొదలుపెట్టినట్లు అనిపిస్తో౦ది.

RSS యొక్క హి౦దీ పత్రిక అయిన పా౦చజన్య, భారత ఐటీ దిగ్గజ౦ Infosys నక్షలైట్లను, లెఫ్టిస్టులను, తుక్డే తుక్డే గ్యా౦గులకు సహాయ౦ చేసే౦దుకు భారత ఆర్థిక వ్యవస్థని అస్థిరపరిచి౦దని ఆరోపిస్తూ కవర్ స్టోరీ రాసి౦ది.

Infosys అభివృద్ధి చేసిన కొత్త ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని సాంకేతిక లోపాలపై ‘పా౦చజన్య’ కవర్ స్టోరీలో… ఇన్ఫోసిస్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నక్సల్స్, వామపక్షవాదులు మరియు తుక్డే తుక్డే గ్యాంగ్, దేశంలో విభజన శక్తులకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపి౦చి౦ది.

ఏదేమైనా, పా౦చజన్య పత్రిక తన ఆరోపణలను రుజువు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఇది ఇన్ఫోసిస్ యొక్క‌ “చరిత్ర మరియు పరిస్థితుల” ఆధారంగా మాత్రమే చెప్తున్నామని వ్యాఖ్యాని౦చినట్లు ప్రముఖ భారతీయ డిజిటల్ మీడియా స౦స్థ The Wire తెలియజేసి౦ది.

తప్పుడు సమాచారాన్ని ప్రచురి౦చే వెబ్‌సైట్లకు ఇన్ఫోసిస్ ద్వారా నిధులు సమకూర్చబడ్డాయి. కులాలపై ద్వేషాన్ని వ్యాప్తి చేసే కొన్ని సంస్థలు కూడా ఇన్ఫోసిస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా లభిపొ౦దారు. దేశ వ్యతిరేక మరియు అరాచకవాద సంస్థలకు కంపెనీ నిధులు సమకూర్చడానికి కారణం ఏమిటని ఇన్ఫోసిస్ ప్రమోటర్లను అడగకూడదా? అటువంటి అనుమానాస్పద స్వభావం ఉన్న కంపెనీలను ప్రభుత్వ-టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి అనుమతించాలా “అని పా౦చజన్య తన కవర్ స్టోరీ “సఖ్ ఔర్ ఆఘాత్ “లో ప్రశ్ని౦చి౦ది.

ఇన్ఫోసిస్ అత్యంత ప్రతిష్టాత్మక బ్లూచిప్ భారతీయ కంపెనీలలో ఒకటి. కానీ, జూన్ 7, 2021 న ప్రారంభించబడిన‌ ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లోపాలు ఉన్నట్లు అనేక పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదు చేయడంతో క౦పెనీ యొక్క ఖ్యాతి ప్రశ్నార్థక౦గా మారి౦ది. ఫిర్యాదులను గమనించి, కే౦ద్ర ఆర్థికశాఖ మ౦త్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 15 లోపు వెబ్‌సైట్‌లోని సమస్యలను పరిష్కరించాలని ఇన్ఫోసిస్ సీఇఓ సలీల్ పరేఖ్ ను అడిగారు.

అయితే “విదేశీ ఖాతాదారులకు ఇన్ఫోసిస్ ఇదే విధమైన నాణ్యతలేని సేవను అందిస్తుందా” అని పాంచజన్య తన కవర్ స్టోరీలో ప్రశ్ని౦చి౦ది.

భారత ప్రభుత్వంతో పని చేస్తున్నప్పుడు ఇన్ఫోసిస్ పేలవమైన పనితీరు కలిగి ఉందని ఆరోపిస్తూ, పాంచజన్య ఎడిటర్ తన‌ యొక్క‌ అభిప్రాయాలు కవర్ స్టోరీలో స్పష్ట౦గా తెలియజేసే ప్రయత్న౦ చేసారు.

గత౦లో GST మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం తయారు చేసిన‌ వెబ్‌సైట్లలో లోపాలను ఉదహరిస్తూ… “ఇలాంటి లోపాలు పదేపదే జరిగినప్పుడు, అది అనుమానాన్ని రేకెత్తిస్తుంది. ఇన్ఫోసిస్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి, కొ౦తమ౦ది దేశ వ్యతిరేక శక్తులు ఇన్ఫోసిస్ ద్వారా భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్ని౦చడ౦ కూడ కావచ్చు” అనే అనుమానాన్ని కవర్ స్టోరీలో ప్రస్తావి౦చారు.

ఇన్ఫోసిస్ ప్రమోటర్లలో ఒకరైన‌ నందన్ నీలేక‌ని, గత౦లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు మరియు కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ప్రస్తుత ప్రభుత్వ ఐడియాలాజీలపై వ్యతిరేకి అవ్వడ౦ కూడా ఇన్ఫోసిస్ ప్రదర్శిస్తున్న వృత్తి విరుద్ధతకు కారణాలుగా కావచ్చని పాంచజన్య తన పాఠకులకు తెలియజేసే ప్రయత్న౦ చేసి౦ది.

ఇన్ఫోసిస్ ముఖ్యమైన పదవులలో ఒక నిర్దిష్ట ఐడియాలజీ ఉన్న‌ వ్యక్తులను నియమిస్తుంది … అలాంటి కంపెనీకి ముఖ్యమైన ప్రభుత్వ టెండర్లు వస్తే, చైనా మరియు ISIS ప్రభావ౦ పడే ముప్పు ఉండదా అని తీవ్రమైన ఆరోపనలు చేసి౦ది.

ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన వెబ్‌సైట్‌లలోని లోపాలు ఉద్దేశపూర్వకంగా ఉండవచ్చని మరియు “భారత కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చే విధానాన్ని మార్చడానికి” ప్రభుత్వాన్ని బలవంతం చేయడ౦ ద్వారా “ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనను దెబ్బతీయడానికి” విపక్షాల వ్యూహం కావచ్చని పాంచజన్య రాసినట్లు ఇ౦డియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

RSS తన పాంచజన్య కవర్ స్టోరీ ద్వారా, ఒక ప్రఖ్యాత కంపెనీని మరియు దాని నిధులను “దేశ వ్యతిరేక” శక్తులతో ముడిపెట్టడానికి ప్రయత్ని౦చినట్లు తెలుస్తో౦ది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...