Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

Date:

Share post:

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. భారతీయ జనతా పార్టీ దాని పేరు మార్చాలని డిమాండ్ చేయడంతో గత కొంతకాలంగా టవర్ చుట్టూ వివాదం నెలకొన్న విషయ౦ తెలిసి౦దే.

ది ఇ౦డియన్ ఎక్శ్ప్రెస్ నివేదిక ప్రకార౦… నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించినందుకు హిందూ వాహిని సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను జనవరి 26న అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ పరిణామం జరిగింది.

మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ… వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు టవర్‌ను త్రివర్ణ పతాకంతో అలంకరించాలని, టవర్‌కు సమీపంలో జాతీయ జెండాను ఎగురవేసేలా స్తంభం నిర్మించాలని నిర్ణయించామన్నారు. గురువారం జిన్నా టవర్‌లో జాతీయ జెండాను ఎగురవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

PTI నివేదిక ప్రకారం, గత ఏడాది డిసెంబర్‌లో, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం టవర్ పేరును మార్చాలని బిజెపి రాష్ట్ర విభాగం డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టించుకోకుంటే స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

అయితే ఈ అంశాన్ని లేవనెత్తినందుకు బీజేపీ సభ్యుడిపై ముస్తఫా మండిపడ్డారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే బదులు కోవిడ్ -19 మహమ్మారి మధ్య నిరుపేదలకు సహాయం చేయడంలో బీజేపీ నాయకులు పాల్గొనాలి” అని ఆయన చెప్పినట్లు ANI పేర్కొంది.

గణతంత్ర దినోత్సవ సంఘటన తరువాత, మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాలు ఉన్న౦దున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎమ్మెల్యే ముస్తఫా, జీఎంసీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో కలిసి మంగళవారం స్మారక చిహ్నాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

MI vs KKR: కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు

IPL 2024: ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న(శుక్రవారం) ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో...

IPL 2024 SRH vs RR : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR)...

IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...