ముస్లింలపై యుద్ధానికి సిద్ధమవ్వ౦డి, మ౦చి ఆయుదాలు పట్టుకో౦డి: నర్సింగానంద్

Date:

Share post:

హరిద్వార్‌లో జరిగిన మూడు రోజుల ‘ధరం సంసద్‘లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింస మరియు హత్యలకు పిలుపునిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయని The Indian Express నివేది౦చి౦ది.

యుపిలో అనేక కేసులను ఎదుర్కొంటున్న వివాదాస్పద యతి నర్సింగానంద్, “ముస్లింలపై యుద్ధానికి” పిలుపునిచ్చారు మరియు “2029లో ముస్లిం ప్రధాని కాలేరని” నిర్ధారించడానికి “హిందువులు ఆయుధాలు పట్టుకోవాలని” కోరారు.

డిసెంబరు 17 నుండి 19 వరకు జరిగిన ఈ సమావేశానికి వివిధ మత సంస్థల అధినేతలు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో ఢిల్లీ బీజేపి మాజీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ్ కూడా ఉన్నారు.

గురువారం రాత్రి, ఉత్తరాఖండ్ పోలీసులు వసీం రిజ్వీ మరియు ఇతరులపై సెక్షన్ 153A (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం మరియు సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. షియా వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ రిజ్వీ ఇటీవలే హిందూ మతంలోకి మారి తన పేరును జితేంద్ర నారాయణ్ త్యాగిగా మార్చుకున్నారు. విచారణ ప్రారంభమైన తర్వాత మరిన్ని పేర్లను చేర్చుతామని పోలీసులు తెలిపారు.

ఎఫ్‌ఐఆర్ తర్వాత, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రతినిధి సుబోధ్ ఉనియాల్ మాట్లాడుతూ… “హరిద్వార్ ధరమ్ సంసద్‌లో ఏదైతే జరిగి౦దో అది తప్పు. పోలీసులు సంబంధిత బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకుంటారు” అని అన్నారు.

ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధి చెందిన ఘజియాబాద్‌లోని ఒక ఆలయ ప్రధాన పూజారి నర్సింగానంద్, గత౦లో బీజేపి మహిళా నాయకులపై కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపనలున్న విషయ౦ తెలిసి౦దే.

హరిద్వార్ సమావేశంలో ఏమి జరిగి౦ది?

భారత్‌ను ఆక్రమించుకున్న తర్వాత ఇస్లామిక్ జిహాద్ అత్యంత శక్తివంతమైనదవుతు౦ది అని నర్సింహానంద్ అన్నారు. హిందువులు ఆర్థిక బహిష్కరణతో పాటు ఇతర‌ చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. “కత్తులను మరచిపోండి… మంచి ఆయుధాలు కలిగిన వారిచే యుద్ధం గెలుస్తుంది” అని అతను చెప్పాడు.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకార౦…

మాజీ బీజేపి అధికార ప్రతినిధి ఉపాధ్యాయ్ మాట్లాడుతూ… “ఇది మూడు రోజుల కార్యక్రమం మరియు నేను ఒక రోజు అక్కడ ఉన్నాను, ఆ సమయంలో నేను వేదికపై సుమారు 30 నిమిషాలు ఉండి రాజ్యాంగం గురించి మాట్లాడాను. నాకు ముందు మరియు తరువాత ఇతరులు ఏమి చెప్పారో, దానికి నేను బాధ్యత వహించను. హిందీలో రాజ్యా౦గ ప్రతి దొరకడ౦ కష్టం కాబట్టి రాజ్యాంగ ప్రతిని వేదికపై ఉన్నవారికి ఇచ్చానని ఆయన చెప్పారు.

గురువారం సాయంత్రం, ఉపాధ్యాయ చివరి రోజున 10 నిమిషాలు ఆ ఈవెంట్‌లో ఉన్నట్లు వీడియో ప్రకటన విడుదల చేశారు. “జనాభా నియంత్రణ, అక్రమ వలసల నియంత్రణ మరియు మత మార్పిడుల నియంత్రణ” వంటి రాజ్యాంగంలోని అసంపూర్ణ భాగాలను హైలైట్ చేయడమే తన ఉద్దేశమని ఆయన అన్నారు.

AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్‌లో మాట్లాడుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ రాష్ట్ర శాఖను కోరినట్లు తెలిపారు. “ఇది మారణహోమానికి ప్రేరేపించే స్పష్టమైన కేసు” అని ఆయన పోస్ట్ చేశారు.

ఉత్తరాఖండ్ డిజీపి అశోక్ కుమార్ The Indian Express తో మాట్లాడుతూ స్థానిక నివాసి వ్రాతపూర్వక ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. “మాకు ఫిర్యాదు చేసిన వ్యక్తి రిజ్వీ పేరును మాత్రమే ఇచ్చాడు మరియు ఇతరుల పేర్లు తనకు తెలియనందున గుర్తు తెలియని వ్యక్తులను పేర్కొన్నాడు. ఒకరిని మాత్రమే పేరు పెట్టడం అనేది చేతన నిర్ణయం కాదు మరియు విచారణ ప్రారంభమైన తర్వాత మేము మరిన్ని పేర్లను జోడిస్తాము. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడ జరిగినది తప్పు మరియు పూర్తిగా చట్టవిరుద్ధం. మేము దాని గురించి తెలుసుకున్న వెంటనే ఎఫ్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించాము” అని ఉత్తరాఖండ్ డిజీపి చెప్పినట్లు ది ఇ౦డియన్ ఎక్స్ప్రెస్ తెలిపి౦ది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

Nepal Plane Crash: నేపాల్ వినమాశ్రయంలో ప్రమాదం

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని విమానాశ్రయంలో (Tribhuvan International Airport - TIA) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సౌర్య ఎయిర్లైన్స్ కు...

YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP - YS Jagan...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

Video: పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్

పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జగన్. మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడంకాదు అంటూ పోలీసులను ఉద్దేశించి వైఎస్ జగన్ వార్నింగ్...

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటున్నట్లు (Joe...

UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోని (UPSC Chairman Manoj Soni resigned) రాజీనామా చేశారు. అయితే ఆయన...

Manolo Marquez: భారత్ ఫుట్‌బాల్ కోచ్ గా మ‌నొలొ మార్కెజ్‌

భారత్ పురుషుల ఫుట్‌బాల్ కోచ్ గా స్పెయిన్ ఫుట్‌బాల్ జ‌ట్టు మేనేజ‌ర్ మ‌నొలొ మార్కెజ్‌ నియమితులు (New India Football Head Coach...