ముస్లింలపై యుద్ధానికి సిద్ధమవ్వ౦డి, మ౦చి ఆయుదాలు పట్టుకో౦డి: నర్సింగానంద్

Date:

Share post:

హరిద్వార్‌లో జరిగిన మూడు రోజుల ‘ధరం సంసద్‘లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింస మరియు హత్యలకు పిలుపునిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయని The Indian Express నివేది౦చి౦ది.

యుపిలో అనేక కేసులను ఎదుర్కొంటున్న వివాదాస్పద యతి నర్సింగానంద్, “ముస్లింలపై యుద్ధానికి” పిలుపునిచ్చారు మరియు “2029లో ముస్లిం ప్రధాని కాలేరని” నిర్ధారించడానికి “హిందువులు ఆయుధాలు పట్టుకోవాలని” కోరారు.

డిసెంబరు 17 నుండి 19 వరకు జరిగిన ఈ సమావేశానికి వివిధ మత సంస్థల అధినేతలు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో ఢిల్లీ బీజేపి మాజీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ్ కూడా ఉన్నారు.

గురువారం రాత్రి, ఉత్తరాఖండ్ పోలీసులు వసీం రిజ్వీ మరియు ఇతరులపై సెక్షన్ 153A (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం మరియు సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. షియా వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ రిజ్వీ ఇటీవలే హిందూ మతంలోకి మారి తన పేరును జితేంద్ర నారాయణ్ త్యాగిగా మార్చుకున్నారు. విచారణ ప్రారంభమైన తర్వాత మరిన్ని పేర్లను చేర్చుతామని పోలీసులు తెలిపారు.

ఎఫ్‌ఐఆర్ తర్వాత, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రతినిధి సుబోధ్ ఉనియాల్ మాట్లాడుతూ… “హరిద్వార్ ధరమ్ సంసద్‌లో ఏదైతే జరిగి౦దో అది తప్పు. పోలీసులు సంబంధిత బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకుంటారు” అని అన్నారు.

ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధి చెందిన ఘజియాబాద్‌లోని ఒక ఆలయ ప్రధాన పూజారి నర్సింగానంద్, గత౦లో బీజేపి మహిళా నాయకులపై కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపనలున్న విషయ౦ తెలిసి౦దే.

హరిద్వార్ సమావేశంలో ఏమి జరిగి౦ది?

భారత్‌ను ఆక్రమించుకున్న తర్వాత ఇస్లామిక్ జిహాద్ అత్యంత శక్తివంతమైనదవుతు౦ది అని నర్సింహానంద్ అన్నారు. హిందువులు ఆర్థిక బహిష్కరణతో పాటు ఇతర‌ చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. “కత్తులను మరచిపోండి… మంచి ఆయుధాలు కలిగిన వారిచే యుద్ధం గెలుస్తుంది” అని అతను చెప్పాడు.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకార౦…

మాజీ బీజేపి అధికార ప్రతినిధి ఉపాధ్యాయ్ మాట్లాడుతూ… “ఇది మూడు రోజుల కార్యక్రమం మరియు నేను ఒక రోజు అక్కడ ఉన్నాను, ఆ సమయంలో నేను వేదికపై సుమారు 30 నిమిషాలు ఉండి రాజ్యాంగం గురించి మాట్లాడాను. నాకు ముందు మరియు తరువాత ఇతరులు ఏమి చెప్పారో, దానికి నేను బాధ్యత వహించను. హిందీలో రాజ్యా౦గ ప్రతి దొరకడ౦ కష్టం కాబట్టి రాజ్యాంగ ప్రతిని వేదికపై ఉన్నవారికి ఇచ్చానని ఆయన చెప్పారు.

గురువారం సాయంత్రం, ఉపాధ్యాయ చివరి రోజున 10 నిమిషాలు ఆ ఈవెంట్‌లో ఉన్నట్లు వీడియో ప్రకటన విడుదల చేశారు. “జనాభా నియంత్రణ, అక్రమ వలసల నియంత్రణ మరియు మత మార్పిడుల నియంత్రణ” వంటి రాజ్యాంగంలోని అసంపూర్ణ భాగాలను హైలైట్ చేయడమే తన ఉద్దేశమని ఆయన అన్నారు.

AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్‌లో మాట్లాడుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ రాష్ట్ర శాఖను కోరినట్లు తెలిపారు. “ఇది మారణహోమానికి ప్రేరేపించే స్పష్టమైన కేసు” అని ఆయన పోస్ట్ చేశారు.

ఉత్తరాఖండ్ డిజీపి అశోక్ కుమార్ The Indian Express తో మాట్లాడుతూ స్థానిక నివాసి వ్రాతపూర్వక ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. “మాకు ఫిర్యాదు చేసిన వ్యక్తి రిజ్వీ పేరును మాత్రమే ఇచ్చాడు మరియు ఇతరుల పేర్లు తనకు తెలియనందున గుర్తు తెలియని వ్యక్తులను పేర్కొన్నాడు. ఒకరిని మాత్రమే పేరు పెట్టడం అనేది చేతన నిర్ణయం కాదు మరియు విచారణ ప్రారంభమైన తర్వాత మేము మరిన్ని పేర్లను జోడిస్తాము. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడ జరిగినది తప్పు మరియు పూర్తిగా చట్టవిరుద్ధం. మేము దాని గురించి తెలుసుకున్న వెంటనే ఎఫ్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించాము” అని ఉత్తరాఖండ్ డిజీపి చెప్పినట్లు ది ఇ౦డియన్ ఎక్స్ప్రెస్ తెలిపి౦ది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...