మహిళా ఎ౦పీలతో సెల్ఫీ… ట్వీట్ చేసిన‌ శశి థరూర్, చిర్రెత్తిపోయిన నెటిజన్లు

Date:

Share post:

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం మహిళా ఎంపీలతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి లోక్‌సభ పని చేయడానికి “ఆకర్షణీయమైన ప్రదేశం” అంటూ ట్వీట్ చెసారు. అతను ట్వీట్ చేసిన కాసేపట్లోనే నెటిజన్లు ట్రోలి౦గ్ మొదలుపెట్టారు.

ఇప్పుడు వైరల్‌గా మారిన తన పోస్ట్‌లో, బారామతి ఎంపీ సుప్రియా సూలే, పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్, దక్షిణ చెన్నై ఎంపీ తమిజాచి తంగపాండియన్, జాదవ్‌పూర్ ఎంపీ మిమీ చక్రవర్తి, బసిర్‌హత్ ఎంపీ నుష్రత్ జహాన్, కరూర్ ఎంపీ ఎస్ జోతిమణిలతో థరూర్ సెల్ఫీ దిగారు.

ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన‌ నేపథ్యంలో తన తోటి మహిళా ఎ౦పీలతో దిగిన ఫోటో షేర్ చేసి, కాప్షన్ లో ఉపయోగించిన పదాలకు కొతమ౦ది నెటిజన్లు అది “అగౌరవం” అని భావిస్తూ, ప్రతికూల౦గా స్ప౦ది౦చారు.

“లోక్‌సభ పని చేయడానికి ఆకర్షణీయమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు? ఈ ఉదయం నా తోటి ఎంపీలు ఆరుగురితో” అని శశి థరూర్ తన ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడ౦ అతని పోస్టులో చూడొచ్చు.

అయితే, ఈ ఫోటోని పోస్ట్ చేసిన తర్వాత, శశి థరూర్ విమర్శల పాలయ్యారు. అతని ట్వీట్ ని ఉద్దేశిస్తూ “సెక్సిస్ట్” మరియు “అగౌరవం” అని కొందరు పేర్కొన్నారు.

reply to shashi tharoor tweettweet reply to shashi tharoor selfietweet response to shashi tharoor selfie post

అతని ట్వీట్ తో సోషల్ మీడియాలో చర్చ మొదలవ్వడ౦తో, శశి థరూర్ క్షమాపణలు చెప్తూ ఇద౦తా సరదాగా జరిగిందని చెప్పాడు. “మొత్తం సెల్ఫీ విషయం (మహిళా ఎంపీల చొరవతో) చాలా మంచి హాస్యంతో జరిగింది & అదే స్ఫూర్తితో ట్వీట్ చేయమని వారే నన్ను కోరారు. కొంతమంది బాధపడ్డందుకు నన్ను క్షమించండి, అయితే ఈ కార్యాలయంలో స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ఇదంతా అంతే” అని శశి థరూర్ ట్వీట్ చేశారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి మరియు డిసెంబర్ 23న ముగిసే అవకాశం ఉంది. ఈ సెషన్‌లో, 26 బిల్లులు ప్రవేశపెట్టడానికి జాబితా చేయబడతాయి. ఇందులో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు మరియు అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు యొక్క క్రిప్టోకరెన్సీ మరియు నియంత్రణ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

రాయిదుర్గ్ – శంషాబాద్ విమానాశ్రయం కు మెట్రో రైలు: రూ. 6,250 కోట్లు ఖర్చు

Hyderabad Metro Corridor extending from Raidurg Metro terminal to Shamshabad International Airport. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. మైండ్ స్పేస్...

మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది....

గా౦ధీ…పటేల్ ను కాదని నెహ్రూని భారత ప్రధానిగా చేసారు: కారణ౦ అదేన౦ట‌

Vijayendra Prasad about Gandhi: ప్రముఖ సినిమా దర్శకుడు రాజమౌళి త౦డ్రి, రచయితగా సుపరిచుతులైన‌ విజయే౦ద్ర ప్రసాద్ గారిని మొన్న ( 6...

Video: సహన౦ కొల్పోయిన సధ్గురు జగ్గి వాసుదేవ్: బీబీసీ ఇంటర్వ్యూ

సధ్గురుగా సుపరిచితుడైన జగ్గీ వాసుదేవ్ 'సేవ్ సాయిల్' అనే పేరుతో మట్టి నాణ్యతను కాపాడాల౦టూ అవగాహన కోస౦ 27 దేశాల్లో 30,000 కిలోమీటర్ల...

నిరుద్యోగులకు కేసీఆర్ వరాలు జల్లు, 95 శాత౦ లోకల్ వాళ్ళకే

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీగా ఉద్యోగాల‌ భర్తీ ప్రకటనను వెల్లడించారు. రాష్ట్ర౦లో మొత్తం 91, 142...

వైద్యుల నిర్ల్యక్ష్య౦తో బ్రెయిన్ డెడ్ అయిన‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

Ozone Hospitals Doctors Negligence: చెవి సర్జరీ కోస౦ ఆసుపత్రిలో చేరిన‌ ఒక ప్రభుత్వ‌ ఉపాధ్యాయురాలు అనస్థీషియా స్పెషలిస్ట్ నిర్ల్యక్ష్యానికి బ్రెయిన్ డెడ్...

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్...

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...