మీ ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? కేరళ హైకోర్టు

Date:

Share post:

కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

న్యాయవాది పీటర్ మైలిపరంబిల్‌పై జస్టిస్ పివి కున్హికృష్ణన్ ధర్మాసనం లక్ష రూపాయల జరిమానా విధి౦చి౦ది. ఇది నిగూఢ ఉద్దేశాలతో దాఖలు చేసిన పనికిమాలిన పిటిషన్ అని, భారీ ఖర్చుతో కూడిన ఫిట్ కేసును కొట్టివేయాలని పేర్కొ౦ది. “పిటిషనర్‌కు రాజకీయ ఎజెండా కూడా ఉందని నాకు బలమైన సందేహం ఉంది” అని న్యాయమూర్తి అన్నారని The Indian Express తెలిపి౦ది.

అయితే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ప్రధాని ఫోటో ఉండటం తన‌ గోప్యతకు భంగం కలిగించడమేనని పిటిషనర్ వాదించారు.

భారత ప్రధానిని గౌరవించడం పౌరుల కర్తవ్యం

న్యాయమూర్తి తన తీర్పులో, “భారత ప్రధానిని గౌరవించడం పౌరుల కర్తవ్యం. అయినప్పటికీ వారు ప్రభుత్వ విధానాలపై మరియు ప్రధానమంత్రి రాజకీయ వైఖరిపై విభేదించవచ్చు. ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్నది పౌరుల సంక్షేమం కోసం కాదని వారు పౌరులను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మహమ్మారి పరిస్థితిలో ధైర్యాన్ని పెంపొందించే సందేశంతో ప్రధానమంత్రి ఫోటోతో కూడిన టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లడానికి పౌరులు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పిటిషనర్ ఆరోపించినట్లు అటువంటి పరిస్థితిలో ప్రాథమిక హక్కు లేదా నిర్బంధ వీక్షణ వంటి మరే ఇతర హక్కుకు భంగం కలగదు” అని అన్నారు.

“క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన వేలాది మంది వ్యక్తులు మన దేశంలో జైళ్లలో వారి అప్పీళ్లను వినడానికి వేచి ఉన్నారు. వేలాది మంది ప్రజలు తమ వివాహ వివాదాలలో ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. తమ ఆస్తి వివాదాల ఫలితం కోసం వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ కోర్టు ఆ వ్యాజ్యాలను వీలైనంత త్వరగా పరిగణించాలి మరియు ఈ కోర్టు ప్రతిరోజూ ఆ పని చేస్తోంది. అటువంటి పరిస్థితిలో, పనికిమాలిన పిటిషన్లు దాఖలైనప్పుడు, దానిని భారీ ఖర్చుతో కొట్టివేయాలి” అని న్యాయమూర్తి పునరుద్ఘాటి౦చారు.

కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (ASGI) S.మను వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లోని ప్రధాని ఫోటో సందేశంతో వస్తుందని, టీకా సర్టిఫికేట్ ద్వారా ఆయన‌ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడంలో తప్పు లేదని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే

పిటిషనర్‌పై తీవ్రంగా స్పందించిన కోర్టు, పిటిషనర్ కనీసం పార్లమెంటరీ కార్యక్రమాలను జాతీయ టీవీలో ప్రత్యక్షంగా చూడటం ద్వారా ప్రధాని మరియు ఇతరులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని అధ్యయనం చేయాలని పేర్కొంది. ‘‘ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కానీ వారు ప్రధానిని ‘గౌరవనీయ ప్రధానమంత్రి’ అని సంబోధిస్తారు’’ అని కోర్టు పేర్కొంది.

భారత ప్రజాస్వామ్య చరిత్రను అధ్యయనం చేయాలని పిటిషనర్‌ను కోరిన న్యాయమూర్తి, భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో జవహర్‌లాల్ నెహ్రూ అధికారంలోకి వచ్చినప్పుడు, భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని గుర్తుచేశారు. 16 మంది సభ్యులతో, “ప్రతిపక్ష నేత పదవిని పొందడానికి ఇది సరిపోదు”.

“అయిన‌ప్పటికి కూడా, నెహ్రూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించారు మరియు పార్లమెంటులో ఓపికగా వినేవారు. పరస్పర గౌరవం ప్రజాస్వామ్యంలో భాగం. లేని పక్షంలో అది ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అవుతుంది’’ అని కోర్టు పేర్కొంది.

గత వారం, మైలిపరంబిల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు, హైకోర్టు పిటిషనర్‌ను ఇలా ప్రశ్నించింది: “మీ ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? ప్రతి ఒక్కరికీ భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఆయన (మోదీ) ఇప్పటికీ మన దేశ‌ ప్రధానమంత్రి” అని అన్నారు.

పిటిషనర్ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని పేర్కొన్న న్యాయమూర్తి, వ్యాక్షీన్ పై ప్రధాని ఫోటో విషయ౦లో 100 కోట్ల మంది ప్రజలకు ఎలాంటి సమస్య కనిపించడం లేదని అన్నారు. కానీ మీకు ఎ౦దుకు సమస్య ఉ౦దో? నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను” అని అన్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...