మీ ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? కేరళ హైకోర్టు

Date:

Share post:

కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

న్యాయవాది పీటర్ మైలిపరంబిల్‌పై జస్టిస్ పివి కున్హికృష్ణన్ ధర్మాసనం లక్ష రూపాయల జరిమానా విధి౦చి౦ది. ఇది నిగూఢ ఉద్దేశాలతో దాఖలు చేసిన పనికిమాలిన పిటిషన్ అని, భారీ ఖర్చుతో కూడిన ఫిట్ కేసును కొట్టివేయాలని పేర్కొ౦ది. “పిటిషనర్‌కు రాజకీయ ఎజెండా కూడా ఉందని నాకు బలమైన సందేహం ఉంది” అని న్యాయమూర్తి అన్నారని The Indian Express తెలిపి౦ది.

అయితే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ప్రధాని ఫోటో ఉండటం తన‌ గోప్యతకు భంగం కలిగించడమేనని పిటిషనర్ వాదించారు.

భారత ప్రధానిని గౌరవించడం పౌరుల కర్తవ్యం

న్యాయమూర్తి తన తీర్పులో, “భారత ప్రధానిని గౌరవించడం పౌరుల కర్తవ్యం. అయినప్పటికీ వారు ప్రభుత్వ విధానాలపై మరియు ప్రధానమంత్రి రాజకీయ వైఖరిపై విభేదించవచ్చు. ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్నది పౌరుల సంక్షేమం కోసం కాదని వారు పౌరులను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మహమ్మారి పరిస్థితిలో ధైర్యాన్ని పెంపొందించే సందేశంతో ప్రధానమంత్రి ఫోటోతో కూడిన టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లడానికి పౌరులు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పిటిషనర్ ఆరోపించినట్లు అటువంటి పరిస్థితిలో ప్రాథమిక హక్కు లేదా నిర్బంధ వీక్షణ వంటి మరే ఇతర హక్కుకు భంగం కలగదు” అని అన్నారు.

“క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన వేలాది మంది వ్యక్తులు మన దేశంలో జైళ్లలో వారి అప్పీళ్లను వినడానికి వేచి ఉన్నారు. వేలాది మంది ప్రజలు తమ వివాహ వివాదాలలో ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. తమ ఆస్తి వివాదాల ఫలితం కోసం వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ కోర్టు ఆ వ్యాజ్యాలను వీలైనంత త్వరగా పరిగణించాలి మరియు ఈ కోర్టు ప్రతిరోజూ ఆ పని చేస్తోంది. అటువంటి పరిస్థితిలో, పనికిమాలిన పిటిషన్లు దాఖలైనప్పుడు, దానిని భారీ ఖర్చుతో కొట్టివేయాలి” అని న్యాయమూర్తి పునరుద్ఘాటి౦చారు.

కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (ASGI) S.మను వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లోని ప్రధాని ఫోటో సందేశంతో వస్తుందని, టీకా సర్టిఫికేట్ ద్వారా ఆయన‌ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడంలో తప్పు లేదని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే

పిటిషనర్‌పై తీవ్రంగా స్పందించిన కోర్టు, పిటిషనర్ కనీసం పార్లమెంటరీ కార్యక్రమాలను జాతీయ టీవీలో ప్రత్యక్షంగా చూడటం ద్వారా ప్రధాని మరియు ఇతరులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని అధ్యయనం చేయాలని పేర్కొంది. ‘‘ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కానీ వారు ప్రధానిని ‘గౌరవనీయ ప్రధానమంత్రి’ అని సంబోధిస్తారు’’ అని కోర్టు పేర్కొంది.

భారత ప్రజాస్వామ్య చరిత్రను అధ్యయనం చేయాలని పిటిషనర్‌ను కోరిన న్యాయమూర్తి, భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో జవహర్‌లాల్ నెహ్రూ అధికారంలోకి వచ్చినప్పుడు, భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని గుర్తుచేశారు. 16 మంది సభ్యులతో, “ప్రతిపక్ష నేత పదవిని పొందడానికి ఇది సరిపోదు”.

“అయిన‌ప్పటికి కూడా, నెహ్రూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించారు మరియు పార్లమెంటులో ఓపికగా వినేవారు. పరస్పర గౌరవం ప్రజాస్వామ్యంలో భాగం. లేని పక్షంలో అది ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అవుతుంది’’ అని కోర్టు పేర్కొంది.

గత వారం, మైలిపరంబిల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు, హైకోర్టు పిటిషనర్‌ను ఇలా ప్రశ్నించింది: “మీ ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? ప్రతి ఒక్కరికీ భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఆయన (మోదీ) ఇప్పటికీ మన దేశ‌ ప్రధానమంత్రి” అని అన్నారు.

పిటిషనర్ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని పేర్కొన్న న్యాయమూర్తి, వ్యాక్షీన్ పై ప్రధాని ఫోటో విషయ౦లో 100 కోట్ల మంది ప్రజలకు ఎలాంటి సమస్య కనిపించడం లేదని అన్నారు. కానీ మీకు ఎ౦దుకు సమస్య ఉ౦దో? నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను” అని అన్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ

Mid Day Meal Scheme: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ, పేదరికం మరియు పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయనే...

Whatsappలో పెద్ద మార్పు: ఇక ఫోన్ నంబర్ అవసరం లేదు!

Whatsapp Username Update: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ మరో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఇకపై Whatsapp...

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒక్కటైనా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి (Drone Attack on Dubai International Airport)...

ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు...

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...

విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad...

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

Galgotias University Robot ఓ చైనా కుక్క: AI Impact Summit 2026

ఢిల్లీలో జరుగుతున్న  India AI Impact Summit 2026 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన Galgotias University robot పేరు ఇప్పుడు దేశం...