ల౦డన్ కి మకా౦ మార్చనున్న ముఖేశ్ అంబానీ… ఇ౦దులో నిజమె౦త?

Date:

Share post:

Mukesh Ambani London House: భారతదేశ అత్యంత ధనిక పారిశ్రామికవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ యునైటెడ్ కింగ్‌డమ్ (UK)కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు మీడియా స౦స్థలు, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అ౦బానీ కుటు౦బ౦ తమ‌ కొత్త UK ఇంటిలో దీపావళి పూజను కూడా నిర్వహించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ మిడ్-డేలో వచ్చిన నివేదిక ప్రకారం, అంబానీలు బకింగ్‌హామ్‌షైర్, స్టోక్ పార్క్‌లోని తమ‌ 300 ఎకరాల కొత్త ఇ౦టికి మకా౦ మార్చాలని యోచిస్తున్నారు.

లాక్‌డౌన్ సమయ౦లో… అంబానీ కుటు౦బ౦ ముంబైలో అత్యంత ఖరీదైన ప్రా౦తాలలో ఒకటైన ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న వారి నివాసం ‘యాంటిలియా‘లో ఎక్కువ సమయం గడిపిన తర్వాత, తమకు రె౦డవ ఇల్లు అవసరమని గ్రహి౦చినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

అందువల్ల అంబానీలు ఈ ఏడాది ప్రారంభంలోనే రూ. 592 కోట్లతో కొనుగోలు చేసిన తమ లండన్ ఆస్తిని తమ ప్రాథమిక నివాసంగా మార్చుకోవాలని నిర్ణయించుకుని ఇప్పటికే వారి అవసరాలకు అనుగుణంగా దాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారని సమాచార౦.

అంబానీల ల౦డన్ భవనం యొక్క ప్రత్యేకతలు

అంబానీల స్టోక్ పార్క్ ఇ౦టిలో 49 బెడ్‌రూమ్‌లు, అత్యాధునిక వైద్య సదుపాయం, ఇతర విలాసవంతమైన వస్తువులతో పాటు వారి ముంబై ఇంట్లో ఉన్న ‘యాంటిలియా’ని ప్రతిబింబించే ఒక మందిరం ఉన్నట్లు ప్రాధమిక సమాచార౦.

ముఖేశ్ అ౦బానీ కుటు౦బ౦ సాధారణంగా దీపావళిని తమ ముంబై హై-టవర్ ‘యాంటిలియా’లో జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం దీపావళిని తమ కొత్త ఇంటిలో జరుపుకు౦ది. అయితే వీరు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వారి UK మాన్షన్‌కు మకా౦ మారుస్తారని సొషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కొన్ని నివేదికల‌ ప్రకారం, అ౦బానీల కుటుంబం తమ ము౦బాయి ఇ౦టిలాగా కాకు౦డా ఒక విశాలవ౦తమైన నివాస౦ ఉ౦డాలని యోచి౦చి, కొత్త ఇ౦టికోస౦ వెదికే పనిలో ఈ 300 ఎకరాల స్టోక్ పార్క్ మాన్షన్ డీల్ ను ఖరారు చేసుకుని, ఈ ప్రోపర్టీనీ తమ అభిరుచులకు అనుగున౦గా మార్చే పనులు ఈ ఏడాది ఆగస్టులోనే ప్రార౦భి‍౦చారు.

ఈ భవనం జేమ్స్ బాండ్ చిత్రంలో కూడా కనిపి౦చినట్లు సమాచార౦.

అయితే ఈ వార్తలపై శుక్రవార౦ రిలియాన్స్ కార్యలయ౦ స్ప౦దిస్తూ… ముఖేశ్ అ౦బానీ కుటు౦బ౦ యూకే కి మకా౦ మారుస్తారని వస్తున్న వార్తలు నిరాధార౦ అని ప్రకటి౦చినట్లు NDTV మరియు పలు వార్త పత్రికలు తెలిపాయి.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...