ల౦డన్ కి మకా౦ మార్చనున్న ముఖేశ్ అంబానీ… ఇ౦దులో నిజమె౦త?

Date:

Share post:

Mukesh Ambani London House: భారతదేశ అత్యంత ధనిక పారిశ్రామికవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ యునైటెడ్ కింగ్‌డమ్ (UK)కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు మీడియా స౦స్థలు, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అ౦బానీ కుటు౦బ౦ తమ‌ కొత్త UK ఇంటిలో దీపావళి పూజను కూడా నిర్వహించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ మిడ్-డేలో వచ్చిన నివేదిక ప్రకారం, అంబానీలు బకింగ్‌హామ్‌షైర్, స్టోక్ పార్క్‌లోని తమ‌ 300 ఎకరాల కొత్త ఇ౦టికి మకా౦ మార్చాలని యోచిస్తున్నారు.

లాక్‌డౌన్ సమయ౦లో… అంబానీ కుటు౦బ౦ ముంబైలో అత్యంత ఖరీదైన ప్రా౦తాలలో ఒకటైన ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న వారి నివాసం ‘యాంటిలియా‘లో ఎక్కువ సమయం గడిపిన తర్వాత, తమకు రె౦డవ ఇల్లు అవసరమని గ్రహి౦చినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

అందువల్ల అంబానీలు ఈ ఏడాది ప్రారంభంలోనే రూ. 592 కోట్లతో కొనుగోలు చేసిన తమ లండన్ ఆస్తిని తమ ప్రాథమిక నివాసంగా మార్చుకోవాలని నిర్ణయించుకుని ఇప్పటికే వారి అవసరాలకు అనుగుణంగా దాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారని సమాచార౦.

అంబానీల ల౦డన్ భవనం యొక్క ప్రత్యేకతలు

అంబానీల స్టోక్ పార్క్ ఇ౦టిలో 49 బెడ్‌రూమ్‌లు, అత్యాధునిక వైద్య సదుపాయం, ఇతర విలాసవంతమైన వస్తువులతో పాటు వారి ముంబై ఇంట్లో ఉన్న ‘యాంటిలియా’ని ప్రతిబింబించే ఒక మందిరం ఉన్నట్లు ప్రాధమిక సమాచార౦.

ముఖేశ్ అ౦బానీ కుటు౦బ౦ సాధారణంగా దీపావళిని తమ ముంబై హై-టవర్ ‘యాంటిలియా’లో జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం దీపావళిని తమ కొత్త ఇంటిలో జరుపుకు౦ది. అయితే వీరు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వారి UK మాన్షన్‌కు మకా౦ మారుస్తారని సొషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కొన్ని నివేదికల‌ ప్రకారం, అ౦బానీల కుటుంబం తమ ము౦బాయి ఇ౦టిలాగా కాకు౦డా ఒక విశాలవ౦తమైన నివాస౦ ఉ౦డాలని యోచి౦చి, కొత్త ఇ౦టికోస౦ వెదికే పనిలో ఈ 300 ఎకరాల స్టోక్ పార్క్ మాన్షన్ డీల్ ను ఖరారు చేసుకుని, ఈ ప్రోపర్టీనీ తమ అభిరుచులకు అనుగున౦గా మార్చే పనులు ఈ ఏడాది ఆగస్టులోనే ప్రార౦భి‍౦చారు.

ఈ భవనం జేమ్స్ బాండ్ చిత్రంలో కూడా కనిపి౦చినట్లు సమాచార౦.

అయితే ఈ వార్తలపై శుక్రవార౦ రిలియాన్స్ కార్యలయ౦ స్ప౦దిస్తూ… ముఖేశ్ అ౦బానీ కుటు౦బ౦ యూకే కి మకా౦ మారుస్తారని వస్తున్న వార్తలు నిరాధార౦ అని ప్రకటి౦చినట్లు NDTV మరియు పలు వార్త పత్రికలు తెలిపాయి.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

Nepal Plane Crash: నేపాల్ వినమాశ్రయంలో ప్రమాదం

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని విమానాశ్రయంలో (Tribhuvan International Airport - TIA) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సౌర్య ఎయిర్లైన్స్ కు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోని (UPSC Chairman Manoj Soni resigned) రాజీనామా చేశారు. అయితే ఆయన...

Manolo Marquez: భారత్ ఫుట్‌బాల్ కోచ్ గా మ‌నొలొ మార్కెజ్‌

భారత్ పురుషుల ఫుట్‌బాల్ కోచ్ గా స్పెయిన్ ఫుట్‌బాల్ జ‌ట్టు మేనేజ‌ర్ మ‌నొలొ మార్కెజ్‌ నియమితులు (New India Football Head Coach...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...