మిషనరీస్ ఆఫ్ ఛారిటీ: FCRA రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్ తిరస్కరి౦చిన కేంద్రం

Date:

Share post:

మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి ( కోల్‌కతా) చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్ర మంత్రిత్వ శాఖ స్తంభింపజేసింది అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత, డిసెంబర్ 25న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, “ప్రతికూల పెట్టుబడులు” ఆధారంగా సదరు NGO యొక్క FCRA రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించడానికి “తిరస్కరిస్తున్నట్లు” తెలిపింది.

అయితే, సంస్థ ఖాతాలను ప్రభుత్వం స్తంభింపజేయలేదని మంత్రిత్వ శాఖ మరియు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వేర్వేరు ప్రకటనలలో పేర్కొన్నాయి. “విషయం పరిష్కరించబడే వరకు ఏ FC ఖాతాలను ఆపరేట్ చేయవద్దని” తమ కేంద్రాలను కోరినట్లు స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

“ప్రతికూల పెట్టుబడులు” ఏమిటో అనేది హోం మంత్రిత్వ శాఖ పేర్కొనలేదు అని ‘The Indian Express’ నివేది౦చి‍౦ది.

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రకటన

సోమవారం, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ తన ప్రకటనలో… “మా శ్రేయోభిలాషుల ఆందోళనను మేము అభినందిస్తున్నాము మరియు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరానికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క FCRA రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేయబడలేదని లేదా రద్దు చేయబడలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము”.

“ఇంకా, మా బ్యాంక్ ఖాతాలలో దేనిపైనా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎటువంటి ఫ్రీజ్‌ను ఆదేశించలేదు. మా FCRA పునరుద్ధరణ దరఖాస్తు ఆమోదించబడలేదని మాకు తెలియజేయబడింది. అందువల్ల, ఎటువంటి లోపం లేకుండా చూసుకోవడానికి, సమస్య పరిష్కరించబడే వరకు ఎఫ్‌సి ఖాతాలలో దేనినీ ఆపరేట్ చేయవద్దని మేము మా కేంద్రాలను కోరడ౦ జరిగి౦ది” అని ప్రకటి౦చినట్లు ‘The Indian Express’ తెలిపి౦ది.

మమతా బెనర్జీ ట్వీట్

అయితే అంతకుముందు, బె౦గాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేస్తూ… “క్రిస్మస్ సందర్భంగా, కేంద్ర మంత్రిత్వ శాఖ భారతదేశంలోని మదర్ థెరిసా యొక్క మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క అన్ని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిందని విని షాక్ అయ్యాను! వారి 22,000 మంది రోగులు & ఉద్యోగులు ఆహారం & మందులు లేకుండా పోయారు. చట్టం ప్రధానమైనప్పటికీ, మానవతా ప్రయత్నాలలో రాజీ పడకూడదు. అని అన్నారు.

ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

“ఇది నిజంగా షాకింగ్. మదర్ థెరిసా నోబెల్ బహుమతిని గెలుచుకున్నప్పుడు, భారతదేశం ఆనంది౦చి౦ది. ఆమె సంస్థ పేదలకు & నిరుపేదలకు సేవ చేసినప్పుడు, ప్రభుత్వం వారి నిధులను నిలిపివేస్తుంది. అవమానకరం’ అని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు.

తరువాత, హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, FCRA 2010 మరియు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రూల్స్ (FCRR) 2011 ప్రకారం అర్హత షరతులను పాటించనందుకు, సంస్థ యొక్క “FCRA రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ… డిసెంబర్ 25, 2021న తిరస్కరించబడింది” అని తెలిపినట్లు తెలుస్తో౦ది.

“ఈ పునరుద్ధరణ తిరస్కరణను సమీక్షించడానికి మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (MoC) నుండి ఎటువంటి అభ్యర్థన / పునర్విమర్శ దరఖాస్తు స్వీకరించబడలేదు” అని MHA పేర్కొంది.

సంస్థ యొక్క రిజిస్ట్రేషన్ అక్టోబరు 31, 2021 వరకు చెల్లుబాటులో ఉందని, రెన్యువల్ దరఖాస్తు పునరుద్ధరణ పెండింగ్‌లో ఉన్న ఇతర FCRA అసోసియేషన్‌లతో పాటు, చెల్లుబాటును డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించారు” అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

“అయితే, MoC యొక్క పునరుద్ధరణ దరఖాస్తును పరిశీలిస్తున్నప్పుడు, కొన్ని ప్రతికూల పెట్టుబడులు గుర్తించబడ్డాయి. రికార్డులో ఉన్న ఈ పెట్టుబడుల‌ పరిశీలనలో, MoC యొక్క పునరుద్ధరణ దరఖాస్తు ఆమోదించబడలేదు… MHA, MoC యొక్క ఏ ఖాతాలను స్తంభింపజేయలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాలను స్తంభింపజేయమని ఎస్‌బిఐకి స్వయంగా MOC అభ్యర్థన పంపినట్లు తెలియజేసింది” అని పేర్కొంది.

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ మంత్రిత్వ శాఖకు సమర్పించిన వార్షిక నివేదికల ప్రకారం, గత ఐదేళ్లలో విదేశీ విరాళాల రూపంలో రూ.425.86 కోట్లు అందుకుంది.

గత 15 ఏళ్లలో ఈ సంస్థకు విదేశీ వనరుల నుంచి రూ.1,099 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2020-21కి సంబంధించి అందుబాటులో ఉన్న తాజా ప్రకటన ఏప్రిల్ 2020 మరియు మార్చి 2021 మధ్య విదేశాల నుండి రూ.75.19 కోట్లు పొందినట్లు చూపుతోంది.

With Inputs from The Indian Express

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

రాయిదుర్గ్ – శంషాబాద్ విమానాశ్రయం కు మెట్రో రైలు: రూ. 6,250 కోట్లు ఖర్చు

Hyderabad Metro Corridor extending from Raidurg Metro terminal to Shamshabad International Airport. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. మైండ్ స్పేస్...

గా౦ధీ…పటేల్ ను కాదని నెహ్రూని భారత ప్రధానిగా చేసారు: కారణ౦ అదేన౦ట‌

Vijayendra Prasad about Gandhi: ప్రముఖ సినిమా దర్శకుడు రాజమౌళి త౦డ్రి, రచయితగా సుపరిచుతులైన‌ విజయే౦ద్ర ప్రసాద్ గారిని మొన్న ( 6...

Video: సహన౦ కొల్పోయిన సధ్గురు జగ్గి వాసుదేవ్: బీబీసీ ఇంటర్వ్యూ

సధ్గురుగా సుపరిచితుడైన జగ్గీ వాసుదేవ్ 'సేవ్ సాయిల్' అనే పేరుతో మట్టి నాణ్యతను కాపాడాల౦టూ అవగాహన కోస౦ 27 దేశాల్లో 30,000 కిలోమీటర్ల...

నిరుద్యోగులకు కేసీఆర్ వరాలు జల్లు, 95 శాత౦ లోకల్ వాళ్ళకే

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీగా ఉద్యోగాల‌ భర్తీ ప్రకటనను వెల్లడించారు. రాష్ట్ర౦లో మొత్తం 91, 142...

వైద్యుల నిర్ల్యక్ష్య౦తో బ్రెయిన్ డెడ్ అయిన‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

Ozone Hospitals Doctors Negligence: చెవి సర్జరీ కోస౦ ఆసుపత్రిలో చేరిన‌ ఒక ప్రభుత్వ‌ ఉపాధ్యాయురాలు అనస్థీషియా స్పెషలిస్ట్ నిర్ల్యక్ష్యానికి బ్రెయిన్ డెడ్...

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్...

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

కోవిడ్ టాబ్లెట్లు: దేశ౦లోనే తొలిసారిగా హైదరాబాద్‌ మార్కెట్‌లోకి విడుదల‌

Molnupiravir Covid Tablets: కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి తయారి చేసిన ఔషద౦ మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్ ఇ౦డియాలో మొదటిసారిగా హైదరాబాద్ మార్కెట్...