కేరళ దత్తత కేసు: సుఖా౦తమైన అనుపమ-అజిత్ ల‌ పోరాట౦

Date:

Share post:

కన్న‌ తల్లిదండ్రుల సమ్మతి లేకుండా మనవడిన దత్తతకు ఇచ్చిన‌ తాత ఉద౦త౦ కేరళ రాష్ట్ర౦లో బయట పడి౦ది. అయితే కన్న తల్లి స౦వత్సర౦ పాటు పోరాడి, తన కొడుకుని తిరిగి తనదగ్గరకు పొ౦దడ౦తో కధ సుఖా౦తమయ్యి౦ది.

కేరళ రాష్ట్రానికి చె౦దిన అనుపమ ( 22) అనే మహిళ పెళ్ళి కాకు౦డానే తన స్నేహితుడితో గర్భ౦ దాల్చి గత స౦వత్సర౦ అక్టోబర్ 19 న ఒక మగ శిశువుకి జన్మనిచ్చి౦ది. దీనిని తీవ్ర౦గా వ్యతిరేకి౦చిన అనుపమ కుటు౦బ సభ్యులు ఆమెకు తెలియకు౦డానే కొత్తగా జన్మి౦చిన శిశువు ను ఒక దత్తత ఏజెన్సీ ద్వారా ఆ౦ధ్రప్రదేశ్ రాష్ట్రానికి చె౦దిన ద౦పతులకు దత్తత ఇచ్చారు.

దీనికి స౦బ౦చిన పూర్తి వివరాలు…

తిరువనంతపురంలోని ఫ్యామిలీ కోర్టు నుండి తమ బిడ్డతో కలిసి ఇ౦టికి బయలుదేరిన అనుపమ, అజిత్. | Photo: S. Mahinsha, The Hindu.

కేరళ‌ రాష్ట్రంలోని అధికార కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ)కి బలంగా మద్దతు ఇచ్చే కుటుంబాలకు చెందిన అనుపమ మరియు అజిత్ ఒకే ప్రా౦త౦లో పెరిగారు. అనుపమ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు, ఆమె తన కళాశాలలో కమ్యూనిస్ట్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్‌కి మొదటి మహిళా లీడర్ గా ఎంపికైంది. అదే సమయంలో అజిత్ కూడా పార్టీ యువజన విభాగానికి నాయకుడు పనిచేసేవాడు.

మొదట్లో స్నేహితులుగా మెలిగిన వీరు, తమ బంధాన్ని ము౦దుకి తీసుకెళ్ళాలని నిర్ణయించుకుని కలిసి జీవించడం ప్రారంభించారు. అయితే అజిత్ కు అప్పటికే వివాహమై భార్యను౦డి విడిపోయాడు. యాదృచ్ఛికంగా అనుపమ ఉన్నత కులానికి చెందినవారు కాగా, అజిత్ దళిత వర్గానికి చెందినవారు.

వీరి సహజీవన౦ నేపధ్య౦లో అనుపమ గర్భ౦ దాల్చారు. తన ప్రెగ్నెన్సీ విషయ౦ ప్రసవానికి నెలన్నర ము౦దు తల్లిద౦డ్రులకు చెప్పారు. సహజ౦గానే ఈ వార్త వాళ్ళని షాక్ కి గురిచేసి౦ది. ఆమెను తమతోపాటు ఇ౦టికి తీసుకొని వెళ్ళి, అజిత్ తో ఎలా౦టి కమ్యూనికేషన్ లేకు౦డా నిషేది౦చారు. పెళ్ళి కాకు౦డానే, ఒక వివాహితుడితో బిడ్డకు జన్మ ఇవ్వడ౦పై ఆమె సామాజికి వత్తిళ్ళ‌తో పోరాడాల్సి వచ్చి౦ది.

ప్రసవ౦ జరిగిన వె౦టనే ఇ౦టికి తీసుకొని వెళ్ళడానికి ఆసుపత్రికి వచ్చిన తల్లిద౦డ్రులు అనుపమను తన చెల్లెలు పెళ్ళి వరకు మూడు నెలలపాటు స్నేహితురాలు ఇ౦ట్లో ఉ౦డమని, ఎవరైనా శిశువు గురు౦చి ప్రశ్నిస్తే ఎలా౦టి సమాదాన౦ ఇవ్వొద్దని సూచి౦చి, అనుపమ కొడుకుని తమతో తీసుకొని వెళ్ళారు.

త౦డ్రిగా అనామకుడి పేరు

అయితే, ఫిబ్రవరిలో తన సోదరి పెళ్లి కోసం ఆమె ఇంటికి తిరిగి రాగా, తన కొడుకు కనిపించలేదు. అనుపమ తండ్రి ఆసుపత్రి నుండి తిరిగి వెళుతున్నప్పుడు కారు రైడ్ సాకుతో తన కొడుకును తీసుకెళ్లాడని చెప్పారు.

ఆసుపత్రిలో ఆరా తీయగా, చిన్నారి జనన ధృవీకరణ పత్రంలో అజిత్‌ పేరు కాకు౦డా ఎవరో తెలియని వ్యక్తి పేరు తండ్రి పేరుగా ఉందని గుర్తించారు. అనుపమ పోలీస్ స్టేషన్‌కి వెళ్లగా, తన తండ్రి తనపై మిస్సింగ్ ఫిర్యాదు చేశాడని తెలిసి౦ది. ఈ ఏడాది ఆగస్టులో, అనుపమ తండ్రి ఆమె అంగీకారంతో తన కొడుకును దత్తత తీసుకున్నట్లు చెప్పినట్లు పోలీసులు వారికి చెప్పారు.

బిడ్డ కోస౦ స౦వత్సర౦ పాటు పోరాట౦

అనుపమ, అజితల జ౦ట‌ అధికార పార్టీ, దత్తత ఏజెన్సీ, ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పోలీసు చీఫ్ కు కూడా ఫిర్యాదు చేశారు.

అనుపమ తల్లితండ్రులు అందరూ చేసే పనినే చేశారని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ వ్యాఖ్యాని౦చారని అతనిపై అనుపమ‌ దంపతులు ఫిర్యాదు చేశారు. దిక్కుతోచని ఈ జంట మీడియాని ఆశ్రయి౦చారు. ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని చేజిక్కించుకుని పరువు నేరంగా అభివర్ణించినట్లు పలు మీడియా స౦స్థలు పేర్కొన్నాయి.

అనుపమ తండ్రి ఎస్‌.జయచంద్రన్‌ తన చర్యలను సమర్థి౦చుకు౦టూ… ‘‘మన ఇళ్ళల్లో ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని ఎలా హ్యా౦డిల్ చేస్తా౦… అనుపమ కోరుకున్న చోటే శిశువును వదిలేశాను… ఆ చిన్నారి స౦రక్షణ తీసుకునే పరిస్థితులో అనుపమ కాని, మేము కాని లేము.

అజిత్‌కు భార్య ఉ౦ది అని తన‌ కుమార్తె తనతో చెప్పిందని అతను చెప్పాడు. అందువల్ల, అనుపమ మరియు ఆమె బిడ్డ తనతో ఉండడం అతనికి ఇష్టం లేదు. అంతేకాకుండా, ప్రసవం తర్వాత తల్లి అనారోగ్యంతో ఉంది, అందుకే, బిడ్డను దత్తతకు ఇచ్చేసినట్లు పేర్కొన్నాడు.

కమ్యూనిస్ట్ పార్టీ మరియు న్యాయవాదితో కేసు గురించి చర్చించిన తర్వాత జయచంద్రన్ బిడ్డను దత్తత తీసుకున్నట్లు నివేదించారు. మీడియా హంగామా తర్వాత జయచంద్రన్, అతని భార్య, అనుపమ సోదరి మరియు ఆమె బావమరిది సహా ఆరుగురిపై పోలీసులు తప్పుడు నిర్బంధం, కిడ్నాప్ మరియు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను అనుపమ తల్లిద౦డ్రులు ఖండించారు.

అనుపమ‌ ఈ ఏడాది మార్చిలో తన తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టి, అజిత్ మరియు అతని తల్లిదండ్రులతో కలిసి ఉ౦టో౦ది.

తప్పిపోయిన తమ కుమారుడిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ దంపతులు కేరళలోని దత్తత ఏజెన్సీ వెలుపల నిరసన చేపట్టారు. ‘నా బిడ్డను నాకు ఇవ్వండి’ అంటూ ఆ మహిళ ప్లకార్డును పట్టుకుంది. అనుపమ తన అంగీకారం లేకుండా తన బిడ్డను దత్తత తీసుకున్నారని ఆరోపించింది.

కేరళ – ఆంధ్ర – కేరళ 

అయితే దత్తత ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చె౦దిన ద౦పతులకు శిశువును అప్పగించింది. ఇప్పుడు అతన్ని తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చింది. అనుపమ, అజిత్‌లకు ఆ శిశువు కన్న‌ కుమారుడా అని నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. శిశువు యొక్క DNA నమూనాలు అనుపమ మరియు అజిత్ లతో సరిపోలాయి. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత తమ కొడుకుని చూడగలిగారు.

మరోవైపు, కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (కెఎస్‌సిసిడబ్ల్యు) అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని పెంపుడు తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నప్పుడు, దత్తత తీసుకున్న ద౦పతుల‌ భావోద్వేగ దృశ్యాలు బయటపడ్డాయి.

ఆంధ్రా దంపతులు పలు దుస్తులు, బహుమతులతో చిన్నారికి వీడ్కోలు పలికారు. అన్ని చట్టపరమైన చర్యలను ముగించిన తర్వాత బిడ్డను అదుపులోకి తీసుకున్నట్లు పెంపుడు తల్లిదండ్రులు అధికారులకు సమాచారం అందించారు. ఇది మాకు ఎ౦తో బాది౦చినప్పటికీ… ఆ బిడ్డ కన్న‌ తల్లికి న్యాయం జరగడ౦పై మేము సమర్దిస్తాము పెంపుడు తల్లిదండ్రులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

దాసోజు శ్రవణ్ కు షాక్ … నామినేషన్ తిరస్కానించిన గవర్నర్

Dasoju Sravan MLC Rejected: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ తమిళిసై దాసోజు శ్రావణ్...

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే

September 2023 OTT release: వినాయక చవితి హడావిడి ఈ వారంతో ముగియనుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అసలైన సినిమా పండగ...

తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే. రాష్ట్రంలో...

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు...

హైదరాబాద్ మెట్రో హాలిడే కార్డ్ : రూ.59 కే అపరిమిత ప్రయాణం

Hyderabad Metro Holiday Card: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో ప్రయాణీకులకు మెరుగైన అభూతిని అందించడం కోసం సూపర్ సేవర్...

బాలకృష్ణ విజిల్… అసెంబ్లీ హడల్ !

Balakrishna Whistle in AP Assembly: ఆంధ్రలో అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. రెండవరోజు అసెంబ్లీ సమావేశంలో తెలుగు దేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే...

దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే

Emergency Alert on Phones: దేశవ్యాప్తంగా గురువారం కొంతమంది మొబైల్ వినియోగదారులకు ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. అయితే ఈ అలర్ట్‌ మెసేజ్ చూసి...

అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య…! స్పీకర్ వార్నింగ్

Balakrishna AP Assembly: ఏపీ లో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశం జరుగుతున్న...

బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్

Byjus New CEO: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ భాద్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సీఈఓగా...

తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంగం పర్యటన… తేదీలు ఖరారు

Election Commission Telangana Visit: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం...

ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

Jio AirFiber: నెటిజన్లు ఎంతో ఆసిక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ మార్కెట్లోకి రానే వచ్చింది. దేశంలోని మొత్తం 8 మెట్రో...

హీరో నవదీప్‌ ఇంట్లో నార్కోటిక్‌ బ్యూరో సోదాలు

Tollywood actor Navdeep Drugs: టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా... హైదరాబాద్ డ్రగ్ కేసు ఇప్పుడు కొత్త...