అంబాలా జైలు మట్టితో గాడ్సే విగ్రహాన్ని రూపొందిస్తా౦: హిందూ మహాసభ

Date:

Share post:

Godse Statue: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ను 1949లో ఉరితీసిన హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన మట్టితో గాడ్సే విగ్రహాన్ని తయారు చేస్తామని హిందూ మహాసభ తెలిపి౦ది.

సోమవారం ( 15 నవ౦బర్) గాడ్సే వర్ధంతిని పురస్కరించుకుని హి౦దూ మహాసభ‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

“గత వారం మహాసభ కార్యకర్తలు గాడ్సే మరియు నారాయణ్ ఆప్టేలను ఉరితీసిన అంబాలా జైలు నుండి మట్టిని తీసుకువచ్చారు. ఈ మట్టితో గాడ్సే, ఆప్టే విగ్రహాల తయారీకి వినియోగిస్తాం, వాటిని గ్వాలియర్‌లోని మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జైవీర్ భరద్వాజ్ విలేకరులకు తెలిపారు.

మీరట్ (ఉత్తరప్రదేశ్)లోని ‘బలిధాన్ ధామ్’లో మహాసభ కార్యకర్తలు గాడ్సే, ఆప్టే విగ్రహాలను సోమవారం ప్రతిష్ఠించారని ఆయన చెప్పారు.

“మేము ప్రతి రాష్ట్రంలో అటువంటి బలిదాన్ ధామ్ నిర్మిస్తాము,” అన్నారాయన.

గ్వాలియర్ జిల్లా యంత్రాంగం 2017లో గాడ్సే ప్రతిమను (ఇక్కడ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేయబడింది) సీజ్ చేసిందని, అయితే ఇప్పటి వరకు దానిని తిరిగి ఇవ్వలేదని ఆయన అన్నారు.

దేశ విభజనకు (1947లో) కాంగ్రెస్సే కారణమని, దీని ఫలితంగా పెద్ద ఎత్తున హత్యలు జరిగాయని భరద్వాజ్ ఆరోపించారు.

ఇదిలా ఉండగా, సోమవారం ఇక్కడ హిందూ మహాసభ బహిరంగ కార్యక్రమం లేదని గ్వాలియర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సత్యేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

ఇప్పటి వరకు ఎలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని, ఆ సంస్థ కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

రాయిదుర్గ్ – శంషాబాద్ విమానాశ్రయం కు మెట్రో రైలు: రూ. 6,250 కోట్లు ఖర్చు

Hyderabad Metro Corridor extending from Raidurg Metro terminal to Shamshabad International Airport. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. మైండ్ స్పేస్...

మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది....

Video: సహన౦ కొల్పోయిన సధ్గురు జగ్గి వాసుదేవ్: బీబీసీ ఇంటర్వ్యూ

సధ్గురుగా సుపరిచితుడైన జగ్గీ వాసుదేవ్ 'సేవ్ సాయిల్' అనే పేరుతో మట్టి నాణ్యతను కాపాడాల౦టూ అవగాహన కోస౦ 27 దేశాల్లో 30,000 కిలోమీటర్ల...

నిరుద్యోగులకు కేసీఆర్ వరాలు జల్లు, 95 శాత౦ లోకల్ వాళ్ళకే

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీగా ఉద్యోగాల‌ భర్తీ ప్రకటనను వెల్లడించారు. రాష్ట్ర౦లో మొత్తం 91, 142...

వైద్యుల నిర్ల్యక్ష్య౦తో బ్రెయిన్ డెడ్ అయిన‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

Ozone Hospitals Doctors Negligence: చెవి సర్జరీ కోస౦ ఆసుపత్రిలో చేరిన‌ ఒక ప్రభుత్వ‌ ఉపాధ్యాయురాలు అనస్థీషియా స్పెషలిస్ట్ నిర్ల్యక్ష్యానికి బ్రెయిన్ డెడ్...

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్...

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

కోవిడ్ టాబ్లెట్లు: దేశ౦లోనే తొలిసారిగా హైదరాబాద్‌ మార్కెట్‌లోకి విడుదల‌

Molnupiravir Covid Tablets: కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి తయారి చేసిన ఔషద౦ మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్ ఇ౦డియాలో మొదటిసారిగా హైదరాబాద్ మార్కెట్...