అంబాలా జైలు మట్టితో గాడ్సే విగ్రహాన్ని రూపొందిస్తా౦: హిందూ మహాసభ

Date:

Share post:

Godse Statue: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ను 1949లో ఉరితీసిన హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన మట్టితో గాడ్సే విగ్రహాన్ని తయారు చేస్తామని హిందూ మహాసభ తెలిపి౦ది.

సోమవారం ( 15 నవ౦బర్) గాడ్సే వర్ధంతిని పురస్కరించుకుని హి౦దూ మహాసభ‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

“గత వారం మహాసభ కార్యకర్తలు గాడ్సే మరియు నారాయణ్ ఆప్టేలను ఉరితీసిన అంబాలా జైలు నుండి మట్టిని తీసుకువచ్చారు. ఈ మట్టితో గాడ్సే, ఆప్టే విగ్రహాల తయారీకి వినియోగిస్తాం, వాటిని గ్వాలియర్‌లోని మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జైవీర్ భరద్వాజ్ విలేకరులకు తెలిపారు.

మీరట్ (ఉత్తరప్రదేశ్)లోని ‘బలిధాన్ ధామ్’లో మహాసభ కార్యకర్తలు గాడ్సే, ఆప్టే విగ్రహాలను సోమవారం ప్రతిష్ఠించారని ఆయన చెప్పారు.

“మేము ప్రతి రాష్ట్రంలో అటువంటి బలిదాన్ ధామ్ నిర్మిస్తాము,” అన్నారాయన.

గ్వాలియర్ జిల్లా యంత్రాంగం 2017లో గాడ్సే ప్రతిమను (ఇక్కడ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేయబడింది) సీజ్ చేసిందని, అయితే ఇప్పటి వరకు దానిని తిరిగి ఇవ్వలేదని ఆయన అన్నారు.

దేశ విభజనకు (1947లో) కాంగ్రెస్సే కారణమని, దీని ఫలితంగా పెద్ద ఎత్తున హత్యలు జరిగాయని భరద్వాజ్ ఆరోపించారు.

ఇదిలా ఉండగా, సోమవారం ఇక్కడ హిందూ మహాసభ బహిరంగ కార్యక్రమం లేదని గ్వాలియర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సత్యేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

ఇప్పటి వరకు ఎలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని, ఆ సంస్థ కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...