Miss Universe 2021 Harnaaz Sandhu: 21 ఏళ్ల తర్వాత భారత్ కు కిరీట౦

Date:

Share post:

Miss Universe 2021 Harnaaz Sandhu: భారతీయ అందాల భామలు చరిత్రలో చాలా సార్లు ‘మిస్ వరల్డ్‘ బిరుదును పొందారు. కానీ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని ఇంటికి తీసుకురాగలిగాం.

అయితే 21 ఏళ్ల తర్వాత… చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు ఇజ్రాయెల్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021లో ‘మిస్ యూనివర్స్ 2021’ టైటిల్‌ను గెలుచుకుని యావత్ భారతదేశాన్ని గర్వపడేలా చేసింది.

గత౦లో ఈ టైటిల్ ను గెలుచుకున్న‌ నటి మరియు మోడల్ సుస్మితా సేన్ (1994) మరియు లారా దత్తా తర్వాత టైటిల్‌ను సొంతం చేసుకున్న మూడవ భారతీయురాలుగా హర్నాజ్ నిలిచారు.

లారా దత్తా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. యాదృచ్ఛికంగా, దత్తా కిరీటాన్ని గెలుచుకున్న సంవత్సరంలోనే హర్నాజ్ సంధు జన్మి౦చడ౦ విశేష౦.

“నాకు మార్గనిర్దేశం చేసినందుకు మరియు మద్దతు ఇచ్చినందుకు ఆ భగవ౦తుడికి, నా తల్లిదండ్రులకు మరియు మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు నేను చాలా కృతజ్ఞురాలుని. నాకోస౦ ప్రార్థించి మరియు నాకు కిరీట౦ దక్కాలని కోరుకున్న‌ ప్రతి ఒక్కరికీ నా ప్రేమాభివ౦దనాలు” అ౦టూ హర్నాజ్ సంధు ఉప్పొంగిపోయినట్లు NDTV తెలిపి‍‍౦ది.

“నా బలం, నా జీవితరేఖలు” అని తన కుటుంబాన్ని ఉద్దేశిస్తూ, ఆమె తన IG కథనాలలో కొన్ని ఫోటోలను పంచుకున్నారు.

ఆమె చివరి రౌండ్‌లో ‘ఈరోజుల్లో ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో యువతులకు ఏమి సలహా ఇస్తారు’ అని అడిగినప్పుడు ఆమె ఇలా స్పందించింది.

“నేటి యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద ఒత్తిడి ఏమిటంటే, తమను తాము విశ్వసించడం, మీరు ప్రత్యేకమైనవారని తెలుసుకోవడం మరియు అదే మిమ్మల్ని అందంగా మార్చడం. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరింత ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం.”

ఈ శుభవార్త వెలువడిన వె౦టనే, ఆన౦ద్ మహి౦ద్రా, ప్రియాంక చోప్రా మరియు లారా దత్తాతో సహా పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలిపారు.

హర్నాజ్ సంధు 2017లో కేవలం 17 సంవత్సరాల వయస్సులో ‘టైమ్స్ ఫ్రెష్ ఫేస్’ అవార్డును గెలుచుకోవడం ద్వారా తన పోటీ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది.

వెంటనే, ఆమె ‘LIVA మిస్ దివా యూనివర్స్ 2021’ టైటిల్‌తో కిరీటాన్ని పొందింది, అక్కడి నుండి ‘మిస్ యూనివర్స్’ గా ఆమె ప్రయాణం ప్రారంభమైంది.

ఈ అందాల భామ ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తోంది మరియు వచ్చే ఏడాది విడుదల కానున్న రెండు పంజాబీ సినిమాలు కూడా ఉన్నాయని సమాచార౦.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

దాసోజు శ్రవణ్ కు షాక్ … నామినేషన్ తిరస్కానించిన గవర్నర్

Dasoju Sravan MLC Rejected: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ తమిళిసై దాసోజు శ్రావణ్...

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే

September 2023 OTT release: వినాయక చవితి హడావిడి ఈ వారంతో ముగియనుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అసలైన సినిమా పండగ...

తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే. రాష్ట్రంలో...

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు...

హైదరాబాద్ మెట్రో హాలిడే కార్డ్ : రూ.59 కే అపరిమిత ప్రయాణం

Hyderabad Metro Holiday Card: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో ప్రయాణీకులకు మెరుగైన అభూతిని అందించడం కోసం సూపర్ సేవర్...

బాలకృష్ణ విజిల్… అసెంబ్లీ హడల్ !

Balakrishna Whistle in AP Assembly: ఆంధ్రలో అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. రెండవరోజు అసెంబ్లీ సమావేశంలో తెలుగు దేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే...

దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే

Emergency Alert on Phones: దేశవ్యాప్తంగా గురువారం కొంతమంది మొబైల్ వినియోగదారులకు ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. అయితే ఈ అలర్ట్‌ మెసేజ్ చూసి...

అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య…! స్పీకర్ వార్నింగ్

Balakrishna AP Assembly: ఏపీ లో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశం జరుగుతున్న...

బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్

Byjus New CEO: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ భాద్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సీఈఓగా...

తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంగం పర్యటన… తేదీలు ఖరారు

Election Commission Telangana Visit: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం...

ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

Jio AirFiber: నెటిజన్లు ఎంతో ఆసిక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ మార్కెట్లోకి రానే వచ్చింది. దేశంలోని మొత్తం 8 మెట్రో...

హీరో నవదీప్‌ ఇంట్లో నార్కోటిక్‌ బ్యూరో సోదాలు

Tollywood actor Navdeep Drugs: టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా... హైదరాబాద్ డ్రగ్ కేసు ఇప్పుడు కొత్త...