మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

Date:

Share post:

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri Lanka Beat India in 3rd ODI0 ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచుల ODI సిరీస్ ను శ్రీలంక 2 -0 తో సొంతం చేసుకుంది. అంతేకాకుండా శ్రీలంక 27 ఏళ్ళ తరువాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో భారత్‌ను ఓడించింది.

ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు 248 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్లు నిశంక (45 పరుగులు), ఫెర్నాండో (96 పరుగులు) మరియు వన్ డౌన్ లో వచ్చిన కుషాల్ మెండిస్ (59 పరుగులు) చేయడంతో శ్రీలంక జట్టు ఒకదశలో భారీ స్కోర్ చేసే దిశలో దూసుకుపోయింది.

అయితే శ్రీలంక బ్యాటర్ల వేగానికి భారత్ బౌలర్లు బాగానే అడ్డుకట్ట వేశారు అనే చెప్పాలి. రియాన్ పరాగ్ మూడు వికెట్లతో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేయగా…అక్షర్, సిరాజ్, సుందర్, కుల్దీప్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.

తదుపరి 249 పరుగుల లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన భారత్… ఓపెనర్ రోహిత్ శర్మ మినహా తక్కినవారెవ్వరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చెయ్యలేదు అనే చెప్పుకోవాలి. ప్రత్యర్థి శ్రీలంక జట్టు స్పిన్ బౌలర్లకు భారత్ బ్యాటర్లు కుదేలయ్యారు. అయితే ఆఖరులో సుందర్ కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారత్ జట్టు ఓటమి అప్పటికే లాంఛనంగా మారిపోయింది.

దీంతో 26 .1 ఓవర్లలో భారత్ 138 పరుగులు మాత్రమే చేసి అల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో విజయంతో శ్రీలంక 2 -0 తేడాతో వన్ డే సిరీస్ ను గెలిచింది. ఇదిలా ఉండగా భారత్ శ్రీలంక మధ్య జరిగిన టీ20 సిరీస్ ను భారత్ దక్కించుకోగా… ఆ తరువాత జరిగిన వన్ డే సిరీస్ ను శ్రీలంక దక్కించుకుంది.

 భారత్ చిత్తు (Sri Lanka beat India in 3rd ODI):

ALSO READమూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Newsletter Signup

Related articles

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...