బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు Padi Kaushik Reddy comments on Revanth Reddy). ఓటుకు నోటు కేసు ట్రయిల్ పూర్తి అయ్యిందని… మరో ఆరు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డికు శిక్ష పాడడం ఖాయం అని అన్నారు.. అయితే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మీడియా సమాచారం ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ఓటుకు నోటు కేసు (Vote ఫర్ Note Case) చివరి దశకు చేరుకుందని… వాటికి తగిన పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన వెంటనే… ఆరు నెలల్లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకి వెళ్లటం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండే అయ్యేది సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయం (Padi Kaushik Reddy comments on Revanth Reddy):
Padi Kaushik Reddy | ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయం #padikaushikreddy #CMRevanthreddy #TelanganaCongress #news18telugu pic.twitter.com/7pHHE6kjnX
— News18 Telugu (@News18Telugu) February 17, 2024