Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం… గురువారం తెల్లవారుజామున ఒక ప్రైవేటు బస్సు, కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో సుమారు 13 మంది సజీవ దహనం కాగ 20 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ప్రాధమిక సమాచారం ప్రకారం… బస్సు , టిప్పర్ ఒకదాన్ని ఒకటి ఢీకొన్న వెంటనే బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని మంటలు వేగంగా వ్యాపించాయి. డీజిల్ ట్యాంక్ పేలడం వల్ల పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది.
విషయం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఘోర బస్సు ప్రమాదం (Markapuram Bus Accident):
ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య
45 మంది ప్రయాణికులతో జగిత్యాల నుండి కలిగిరి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు
తెల్లవారు జామున 4 గంటల సమయంలో మార్కాపురం జిల్లా రాయవరం వద్ద టిప్పర్ లారీని ఢీకొట్టగా చెలరేగిన మంటలు
బస్సులోని ఇద్దరు డ్రైవర్లు,… https://t.co/da6iaA8gpP pic.twitter.com/aJb2lRN3fP
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026
ALSO READ: దుబాయ్ ఎయిర్పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు




